రైల్వేస్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు మాత్రమే జేబుల్ని గుల్ల చేస్తోందని మనకు తెలిసిన విషయమే. ఈ చార్జీలను తగ్గించాలని ఏకంగా రాష్ట్రమంత్రి కేటీఆర్ స్వయగా అప్పటి రైల్వే మంత్రిత్వశాఖకు, మంత్రికి కూడా ఉత్తరాలను రాశారు. సరిగ్గా అలాంటి ఘటనే కాకపోయినా.. రైల్వే తెరమాటు బాదుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ఎవరైన రైల్వే స్టేషన్లో టాయ్లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? మహా అయితే ఐదు రూపాయలు.. కాకుంటే 10 రూపాయలు. అలా కాకుండా ఏకంగా విస్మయం గోలిపే ధరను వసూలు చేశారు.
ఔనా.. ఇంతకీ ఎంత వసూలు చేశారు. అంటే ఏకంగా రూ.112 వసూలు చేశారు. ఔనా అంటే ఇది ఎక్కడ జరిగిందీ.. అంటే ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి అత్యంత చేరువలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రపంచంలోని అద్భుత నిర్మాణమైన తాజ్ మహాల్ ను వీక్షించేందుకు వచ్చిన ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు ఆగ్రా రైల్వేస్టేషన్ లో ఈ విస్మయ ఘటన ఎదురైంది. ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు టాయిలెట్ కు వెళ్లి ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్లెట్కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్కు తీసుకెళ్లాడు.
బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్లెట్కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ.
లాంజ్ వినియోగించుకున్నది ఇద్దరు బ్రిటీష్ జాతీయులైనప్పటికీ వారికి 50 శాతం డిస్కౌంట్ కూడా కల్పించామని.. ఆ రాయితీ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి ఒక్కోక్కరికి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. దీంతో ఇద్దరికీ కలపి ఏకంగా రూ.224 వసూలు చేసింది ఐఆర్సీటీసీ. ఇక ఐఆర్సీటీసీ లీలల గురించి మాట్లాడటం మొదలు పెడితే అన్నీ ఇన్నీ కావు. ఇటీవల భోపాల్ శతాబ్ది రైలులో భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న తరుణంలో ఒక వ్యక్తి కాసింత ఉపశమనం పొందేందుకు టీ ఆర్డర్ ఇచ్చాడు. దాని చార్జీ రూ.70 బిల్లును అతని చేతిలో పెట్టింది ఐఆర్సీటీసీ. ఇంతెందుకు అంటే.. సర్వీసు చార్జీ రూ.50. రూ.20 చాయ్ కి రూ.50 సర్వీసు చార్జీ వేసిన ఘనత మన ఐఆర్సీటీసీ తప్ప మరెవరికీ దక్కదు.
A passenger was left stunned after being charged Rs 70 for a cup of tea while travelling on the #BhopalShatabdi train running between Delhi and Bhopal. He had to pay a service charge of Rs 50 for a cup worth Rs 20.
— Mirror Now (@MirrorNow) July 1, 2022
Thread pic.twitter.com/pL7WdCOoGE
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more