Patna terror module case: NIA searches locations in Bihar, UP పాట్నా టెర్రర్‌ మాడ్యూల్‌ నిందితుల ఇండ్లలో ఎన్‌ఐఏ సోదాలు

Patna terror module case nia begins probe raids houses of several accused

NIA, Patna, Bihar, terror module, Athar Parvez, Mohammed Jalaluddin, Jharkhand Police officer, retired Police officer, Nuruddin, Sanaullah, Mustaqeem, Darbhanga, terrorists, PM Modi, MHA, Amit Shah, Islamic nation, Uttar Pradesh, PM Modi, National Crime

On July 14, the Patna terror module case was busted with the arrest of Athar Parvez and Mohammed Jalaluddin, a retired Jharkhand Police officer. NIA has started a probe into the Patna terror module and raided the houses of the three suspected terrorists, All the accused are members of the Popular Front of India (PFI). The module intended to convert India to an Islamic nation by 2047.

పాట్నా టెర్రర్‌ మాడ్యూల్‌ నిందితుల ఇండ్లలో ఎన్‌ఐఏ సోదాలు

Posted: 07/28/2022 03:15 PM IST
Patna terror module case nia begins probe raids houses of several accused

బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నా ఉగ్రదాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. దర్భంగాలోని ఉగ్రవాద అనుమానితులైన సనావుల్లా, నూరుద్దీన్, ముస్తాఖీం ఇండ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)లో క్రియాశీలక సభ్యులైన ఈ ముగ్గురు నిందితుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో నూరిద్దీన్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నూరిద్దీన్ ప్రస్తుతం పాట్నా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండగా, మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

దర్భంగా సహా ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకునే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ మూడు బృందాలను ఏర్పాటు చేసింది. పాట్నా ఉగ్రదాడి మాడ్యూల్‌ను బీహార్ పోలీసులు జులై 14న ఛేదించారు. అదే రోజున అథర్ పర్వేజ్ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ ఉగ్రకుట్ర బట్టబయలైంది. ఈ కుట్రలో జార్ఖండ్ కు చెందిన రిటైర్డు పోలీసు అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ పాత్ర కూడా ఉండటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఆయనను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసలు రిమాండ్ కు తరలించారు.

హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న యావత్ భారతావనిని 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు దేశప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకోవాలని దాడులకు పాల్పడాలని అరెస్టైయిన ముగ్గరితో పాటు పరారీలో ఉన్న ఇద్దరు ముష్కరులు కూడా కుట్ర పన్నారని పోలీసులు చెప్పారు. కాగా, ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. దీంతో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన 26 మంది అనుమానిత ఉగ్రవాదుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా ఈ ఉగ్రకుట్రకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA  Patna  Bihar  terror module  terrorists  PM Modi  MHA  Amit Shah  Islamic nation  Uttar Pradesh  PM Modi  National Crime  

Other Articles