నిత్యావసర సరుకులు ఓ వైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు కూడా అంతకంతకూ అందకుండా పోతున్నాయి.. దేశంలో మధ్యతరగతి వారు రెండు పూటలా తినాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక కాసింత ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో వారాంతంలోనో, లేక మాసంలో ఒకసారి కుటుంబంతో కలిసి సరదాగా రెస్టారెంట్కు వెళితే పెరిగిన ధరలతో జేబు గుల్ల కావడం గ్యారంటీ. ఓ వైపు బిల్లు రాగానే మనకు వడ్డించిన వస్తువులు ఏన్ని దేనికెంత ధర వేశారో చూసుకున్న తరువాత.. జీఎస్టీ ఎంత వేశారు.. సర్వీసు చార్జీల పేరుతో ఎంత అదనంగా వడ్డించారు అన్నది తప్పక చూసుకోవాల్సి వస్తుంది.
ఈ సర్వీసు చార్జీల నేపథ్యంలోనే చాలావరకు ఇళ్లలోనే కూర్చోని స్విగ్గీ, జోమాటో సర్వీసులను వినియోగించుకున్నారు సగటు మధ్య తరగతివాసులు. అంతలా సర్వీసు చార్జీలు బాదుడు వినియోగదారులను కుంగదీస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని వసూలు చేయరాదని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. ఫుడ్ బిల్లులపై ఆటోమేటిక్గా లేదా డిఫాల్ట్గా సర్వీసు చార్జీలను వసూలు చేయవద్దని హోటళ్లు, రెస్టారెంట్లకు స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన హోటళ్లు, రెస్టారెంట్లపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని సీసీపీఏ పేర్కొంది.
ఎలాంటి ఇతర పేర్లతో సర్వీసు చార్జీని వసూలు చేయరాదని తేల్చిచెప్పింది. సర్వీస్ చార్జి చెల్లించాలని ఏ హోటల్, రెస్టారెంట్ వినియోగదారులపై ఒత్తిడి తీసుకురాకూడదని ఆదేశించింది. వినియోగదారుడు స్వచ్ఛందంగా సర్వీస్ చార్జీ చెల్లించవచ్చని దీనిపై ఎలాంటి బలవంతం ఉండదని వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తెలియచేయాలని కోరింది. ఈ మేరకు ఇదివరకే దేశ న్యాయస్థానాలు తీర్పును వెలువరిచాయని పేర్కోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు గతంలో అదేశాలసు జారీ చేసిన విషయాన్ని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గుర్తుచేసింది.
ఫుడ్ బిల్లుతో పాటు సర్వీస్ చార్జిని కలిపి మొత్తం బిల్లుపై జీఎస్టీ విధించడం అనుమతించబోమని తెలిపింది. సర్వీస్ చార్జిని బిల్లులో కలిపి ఆ మొత్తంపై జీఎస్టీ విధిస్తే సర్వీస్ చార్జిని తొలగించాలని వినియోగదారులు ఆయా హోటళ్లు, రెస్టారెంట్లను కోరవచ్చని పేర్కొంది. సమస్య పరిష్కారం కాకుంటే వినియోగదారులు 1915 నెంబర్పై నేషనల్ కన్జూమర్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎన్సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఇక అలాగని తినే ఆహార పదార్థాలపై హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలను పెంచితాయన్న అనుమానాలను కూడా వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more