నిత్యావసర సరుకులు ఓ వైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు కూడా అంతకంతకూ అందకుండా పోతున్నాయి.. దేశంలో మధ్యతరగతి వారు రెండు పూటలా తినాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక కాసింత ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో వారాంతంలోనో, లేక మాసంలో ఒకసారి కుటుంబంతో కలిసి సరదాగా రెస్టారెంట్కు వెళితే పెరిగిన ధరలతో జేబు గుల్ల కావడం గ్యారంటీ. ఓ వైపు బిల్లు రాగానే మనకు వడ్డించిన వస్తువులు ఏన్ని దేనికెంత ధర వేశారో చూసుకున్న తరువాత.. జీఎస్టీ ఎంత వేశారు.. సర్వీసు చార్జీల పేరుతో ఎంత అదనంగా వడ్డించారు అన్నది తప్పక చూసుకోవాల్సి వస్తుంది.
ఈ సర్వీసు చార్జీల నేపథ్యంలోనే చాలావరకు ఇళ్లలోనే కూర్చోని స్విగ్గీ, జోమాటో సర్వీసులను వినియోగించుకున్నారు సగటు మధ్య తరగతివాసులు. అంతలా సర్వీసు చార్జీలు బాదుడు వినియోగదారులను కుంగదీస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని వసూలు చేయరాదని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. ఫుడ్ బిల్లులపై ఆటోమేటిక్గా లేదా డిఫాల్ట్గా సర్వీసు చార్జీలను వసూలు చేయవద్దని హోటళ్లు, రెస్టారెంట్లకు స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన హోటళ్లు, రెస్టారెంట్లపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని సీసీపీఏ పేర్కొంది.
ఎలాంటి ఇతర పేర్లతో సర్వీసు చార్జీని వసూలు చేయరాదని తేల్చిచెప్పింది. సర్వీస్ చార్జి చెల్లించాలని ఏ హోటల్, రెస్టారెంట్ వినియోగదారులపై ఒత్తిడి తీసుకురాకూడదని ఆదేశించింది. వినియోగదారుడు స్వచ్ఛందంగా సర్వీస్ చార్జీ చెల్లించవచ్చని దీనిపై ఎలాంటి బలవంతం ఉండదని వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తెలియచేయాలని కోరింది. ఈ మేరకు ఇదివరకే దేశ న్యాయస్థానాలు తీర్పును వెలువరిచాయని పేర్కోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు గతంలో అదేశాలసు జారీ చేసిన విషయాన్ని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గుర్తుచేసింది.
ఫుడ్ బిల్లుతో పాటు సర్వీస్ చార్జిని కలిపి మొత్తం బిల్లుపై జీఎస్టీ విధించడం అనుమతించబోమని తెలిపింది. సర్వీస్ చార్జిని బిల్లులో కలిపి ఆ మొత్తంపై జీఎస్టీ విధిస్తే సర్వీస్ చార్జిని తొలగించాలని వినియోగదారులు ఆయా హోటళ్లు, రెస్టారెంట్లను కోరవచ్చని పేర్కొంది. సమస్య పరిష్కారం కాకుంటే వినియోగదారులు 1915 నెంబర్పై నేషనల్ కన్జూమర్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎన్సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఇక అలాగని తినే ఆహార పదార్థాలపై హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలను పెంచితాయన్న అనుమానాలను కూడా వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more