PM unveils statue of freedom fighter Alluri Sitarama Raju అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

Pm modi unveils alluri sitarama raju statue says alluri symbolises spirit of ek bharat shreshtha bharat

Alluri Sitarama Raju, 125th birth anniversary, Manyam Dora, revolutionary freedom fighter, Land of Patriot, PM Modi, Alluri Sitarama Raju, 30 ft statue, Bhimavaram, birth anniversary, Manyam Dora, Andhra CM, YS Jagan, narendra modi, YS Jagan Mohan Reddy, Bhimavaram, Andhra Pradesh, Politics

Prime Minister Narendra Modi unveiled the 30-feet statue of revolutionary freedom fighter Alluri Sitarama Raju in Bhimavaram in West Godavari district of Andhra Pradesh. The statue was unveiled on the occasion of the 125th birth anniversary celebrations of Alluri Sitarama Raju also known as Manyam Dora. The Centre is organising various events on the occasion for one year as part of Azadi ka Amrut Mahotsav.

అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ.. యావత్ దేశానికి ఆయన ఆదర్శమన్న ప్రధాని

Posted: 07/04/2022 01:49 PM IST
Pm modi unveils alluri sitarama raju statue says alluri symbolises spirit of ek bharat shreshtha bharat

అల్లూరి సీతారామరాజు సదా స్మరణీయుడని, యావత్‌ భారతావనికి ఆయన స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు చెందిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు ఒక్క ప్రాంతానికి చెందినది కాదని దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారని అందులో అల్లూరి సీతారామరాజు ప్రముఖుల్లో ఒకరని అన్నారు. ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆంగ్లేయులను ఎదిరించారని తెలిపారు. అల్లూరి జననం నుంచి బలిదానం వరకు చేసిన పోరాటాలు అందరికీ తెలియాలని , ఆదివాసీల శౌర్యం, ధైర్యానికీ ప్రతీక అల్లూరి అని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో యువకులు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా యువకులు భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.

తన ప్రసంగంలో ఏపీలోని ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంత్‌, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశ లింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. వీరుల స్వప్నాలను నెరవేర్చే బాధ్యత నయాభారత్‌ లో అందరిదని అన్నారు.  ఆదివాసీలు తయారు చేస్తున్న 12 ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ఉండగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 90 ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీలున్న జిల్లాల అభివృద్ధికి లాభం చేకూరేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాసంస్థలను నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles