అల్లూరి సీతారామరాజు సదా స్మరణీయుడని, యావత్ భారతావనికి ఆయన స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు చెందిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు ఒక్క ప్రాంతానికి చెందినది కాదని దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారని అందులో అల్లూరి సీతారామరాజు ప్రముఖుల్లో ఒకరని అన్నారు. ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆంగ్లేయులను ఎదిరించారని తెలిపారు. అల్లూరి జననం నుంచి బలిదానం వరకు చేసిన పోరాటాలు అందరికీ తెలియాలని , ఆదివాసీల శౌర్యం, ధైర్యానికీ ప్రతీక అల్లూరి అని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో యువకులు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా యువకులు భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
తన ప్రసంగంలో ఏపీలోని ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంత్, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశ లింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. వీరుల స్వప్నాలను నెరవేర్చే బాధ్యత నయాభారత్ లో అందరిదని అన్నారు. ఆదివాసీలు తయారు చేస్తున్న 12 ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ఉండగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 90 ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీలున్న జిల్లాల అభివృద్ధికి లాభం చేకూరేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాసంస్థలను నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more