మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిణామాల మధ్య మహారాష్ట్రవాసులు కన్నార్పకుండా గమనిస్తున్నారు. శివసేనకు చెందిన పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరినా.. అక్కడి నుంచి తమతో కొందరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించగా.. అదంతా అవాస్తవమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ శిందే ఖండించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరెవరు తమతో టచ్ లో ఉన్నారో వారి పేర్లను వెల్లడించాలని కూడా ఆయన వర్గం డిమాండ్ చేసింది.
ఈ పరిణామాల క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే గౌహతిలోని స్టార్ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలకు కీలక విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ముంబైకి తిరిగి వచ్చి.. తనతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు. ‘‘మీలో చాలా మంది మాతో టచ్లో ఉన్నారు.. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘సమయం ఇంకా మించిపోలేదు. నాతో కూర్చొని మాట్లాడండి’’ అని విన్నవించారు.
అంతేకాదు ‘‘తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలి. ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదు. మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నా.. మీలోని చాలామంది కుటుంబసభ్యులు మాతో వచ్చి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.. వారికి మేము గౌరవించి పరిగణలోకి తీసుకున్నాం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, పార్టీలోని మరో అగ్రనేత సంజయ్ రౌత్ రెబల్ ఎమ్మెల్యేలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
శివసేన వీడి ఏక్ న్నాథ్ షిండే పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యేల వాదన విచిత్రంగా ఉందని ఆయన ముంబై సమీపంలోని అలిబాగ్ లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వీరు తెరవెనుక నెరపిన రాజకీయమంతా డబ్బు మాత్రమేనని అరోపించారు. శివసేన పార్టీ హిందుత్వ భావజాలం ఉన్న బీజేపిని కాదని.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టంలేక తాము తిరుగుబాటు చేశామని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పాలన్నారు. షిండే వర్గంలో ఉన్న ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపి నుంచి శివసేనలో చేరినవారేనని అన్నారు. వారు ఏ హిందుత్వ గురించి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక అధికార కోసం పీడిపీతో కలసి బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని వీరు మర్చిపోయారా.? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more