Mastermind of Secunderabad Attack Sent To Remand అగ్నిపాథ్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి సుబ్బారావు అరెస్ట్..!

Agnipath scheme subba rao mastermind of secunderabad attack sent to remand

Telangana, Avula Subba Rao, Sai Defence Academy, Director, Secunderabad railway station, WhatsApp chats, Agnipath scheme, Protest, Crime

Avula Subba Rao, the director of Sai Defence Academy, who provoked the violence at Secunderabad railway station in Telangana on 17th June sent to remand. Subba Rao's role came into the picture after some of the WhatsApp chats were leaked and one could see his photograph in a group which allegedly planned the attack on the Secunderabad Railway Station as a protest against the Agnipath recruitment scheme

అగ్నిపాథ్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి సుబ్బారావు అరెస్ట్..!

Posted: 06/25/2022 12:59 PM IST
Agnipath scheme subba rao mastermind of secunderabad attack sent to remand

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్‌ విధించింది. సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావును సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా తేల్చారు పోలీసులు. సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రైల్వే కోర్టు నుంచి సుబ్బారావుతో పాటు అతని అనుచరులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా రైల్వే పోలీసులు తేల్చారు. సూత్రధారితో పాటు కేసులోని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 149 ఐపీసీ సహా 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వీటితో పాటుగా  రైల్వే యాక్ట్ సెక్షన్ 3,4 తో పాటు మరిన్ని సెక్షన్లను నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.  వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విధ్వంసం సృషించే విధంగా వాళ్లు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు గర్తించారు. 16న సాయంత్రం నరసరావుపేట నుంచి హైదరాబాద్‌ వచ్చిన సుబ్బారావు,.. బోడుప్పల్‌లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేసినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లో చేసే విధ్వంసానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్టు చేశారని పేర్కొన్నారు.

అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ వచ్చేలా చేయాలని తన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డికి ఆవుల సుబ్బారావు సూచించారని పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్న యువకులకు రూ.35వేలు ఇచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి సహాయ సహకారాలు అందించారని వివరించారు. సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డి సికింద్రాబాద్ వచ్చి విధ్వంసంలో పాల్గొన్నారని... విధ్వంసానికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ ద్వారా సుబ్బారావుకు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిపథ్ పథకం వల్ల డిఫెన్స్ అకాడమీలు నష్టాల పాలవుతాయనే ఉద్దేశంతోనే విధ్వంసానికి కుట్ర పన్నారని గుర్తించారు.

రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తేనే కేంద్రం అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని కుట్ర పన్నారు. విధ్వంసం తర్వాత తన పాత్ర బయటపడకుండా వాట్సప్ గ్రూపులలోని సందేశాలను డిలీట్‌ చేసినట్లు జీఆర్పీ ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మరికొన్ని డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాగా, అగ్నిపాథ్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావును బలి పశువును చేశారని ఆయన తరపు న్యాయవాది అన్నారు. సుబ్బారావు దేశ భక్తి మెండుగా ఉన్న వ్యక్తి అని, అతనిపై పోలీసులు మోపిన అభియోగాలు అన్ని తప్పుడు అభియోగాలని చెప్పారు. సుబ్బారావు ఏ వాట్సప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా లేడని, ఎలాంటి హింసాత్మక మెసేజెస్, వీడియోలు ఫార్వర్డ్ చేయలేదని తెలిపారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles