మహారాష్ట్రలోని మహావికాస్ఆఘాడి ప్రభుత్వకూటమి కుప్పకూలడం ఖాయంగా మారింది. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రస్తుతం అధికారంలో ఉండగా, శివసేన పార్టీ నుంచి ఏకంగా 40 మంది వరకు ఎమ్మెల్యేలను ఆ పార్టీ నేత ఏక్ నాథ్ షిండే.. గుజరాత్ కు తరలించి.. అక్కడి నుంచి అసోంకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అంతేకాదు.. ఇకపై ఉద్దవ్ థాకరేకు సంబంధించి శివసేనకు ఎలాంటి సంబంధం లేదని, అసలైన శివసేన తమదేనని, తననే అత్యధిక మంది ఎమ్మెల్యేలు నాయకుడిగా ఎన్నుకున్నారని ఆయన ప్రకటించడం మహారాష్ట్ర సహా దేశరాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది.
ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే సాయంత్రం ఐదు గంటల వరకు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, అప్పటిలోగా తిరిగి రావాలని. ఆ తరువాత వచ్చిన వారిని తాను తమ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించబోనని చెప్పడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో గంటగంటకు మారుతూవచ్చాయి. ‘మహా’ రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ థాకరే ఇవాళ సాయంత్రం ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకవ్యాఖ్యలు చేశారు. తాను పదవి కోసం పోరాటం చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
తానేమీ సీఎం కావాలని కోరుకోలేదని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభీష్టం మేరకే తాను ఆ పదవిని స్వీకరించానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ పదవిని కూడా తాను సమర్థంగానే నిర్వహించానని తెలిపారు. హిందూత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమన్న థాకరే... దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు.సీఎం పదవికి తాను సరిపోనని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే పదవి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా... మరుక్షణమే తాను పదవికి రాజీనామా చేస్తానని థాకరే కీలక ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా లేఖను తన వద్దే సిద్ధంగా ఉంచుకున్నానని కూడా ఆయన ప్రకటించారు.
శివసైనికుడు ఎవరైనా సీఎం కావచ్చనన్న ఆయన.. ఆ పదవి కోసం నమ్మక ద్రోహానికి పాల్పడటం క్షమార్హం కాదన్నారు. తాను నమ్మకద్రోహానికి గురయ్యానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యానని తెలిపారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ కు తెలిపానని అన్నారు. చర్చలకు రావాలని ఏక్ నాథ్ షిండే, రెబెల్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. శివసేన పార్టీని నడిపేందుకు తాను పనికిరానని చెపితే తాను తప్పుకుంటానని ఉద్ధవ్ అన్నారు. మహా ప్రజలపై మళ్లీ ఎన్నికల భారం మోపడం ఇష్టంలేకే తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిశామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more