అగ్నివీరులుగా బయటకు వచ్చిన తరువాత వారికి మంచి అవకాశాలు ఉంటాయని ఇటీవల అగ్నపాత్ పథకాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన నలుగురు పారిశ్రామిక వేత్తలకు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక అగ్నివీరులకు తాను ఉద్యోగాలిస్తానంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల చేసిన ట్వీట్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఓ వైపు ఆశావహులు, మరోవైపు యువత, నెటిజనులు, సోషల్ మీడియా నుంచి తీవ్ర విమర్శలను చవిచూశారు.
ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని చేసిన ట్వీట్ పై కూడా మండిపడుతున్నారు. ఇక తాజాగా పలువురు మాజీ సైనికాధికారులు కూడా ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు. వీరిలో భారత నావికాదళం మాజీ చీఫ్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మాజీ చైర్మన్ అరుణ్ ప్రకాష్ వంటి వారు కూడా ఉన్నారు. సర్వీసు పూర్తిచేసుకున్న అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తారు సరే.. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఎంతమంది సైనికాధికారులకు మీ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
కొత్త పథకం కోసం వేచి చూడడం ఎందుకని, ఇప్పటికే నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన వేలాదిమంది మాజీ సైనికులు, సైనికాధికారులు ఉన్నారని, ప్రతి సంవత్సరం వేలాదిమంది సైన్యం నుంచి బయటకు వచ్చి తమ రెండవ కెరియర్ను ప్రారంభించేందుకు వేచి చూస్తున్నారని ఆనంద్ మహీంద్రాకు అరుణ్ ప్రకాశ్ గుర్తు చేశారు. అలాంటి వారిలో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారో వెల్లడిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు. తాను 40 ఏళ్లుగా వాయుసేనలో సేవలు అందించానని, ఏళ్ల తరబడి ఇలాంటి హామీలను వింటున్నానని వాయుసేన మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ అన్నారు.
ఇది అగ్నిపాత్ పథకంపై దేశవ్యాప్తంగా ఎంతటి నిరసన ఉందో తెలియజేస్తోందని అన్నారు. ఆర్మీ ఉద్యోగాల కోసం ఎందరో యువత కొన్నేళ్లుగా కఠోర శ్రమకు ఓర్చి శ్రమిస్తుండగా, వారి ఆశలను అడియాశలు చేస్తూ కేంద్రం ప్రకటనలు చేయడం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే దీనిని అప్పటికప్పుడు ప్రకటించినట్టుగా ఉందని మాజీ సైనిక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అగ్నిపాథ్ పై రోజుకో ప్రకటన చేస్తుండడం.. ఆర్మీలో చేరే యువతకు తప్పుడు సంకేతాలను అందిస్తోందని విమర్శించారు. 25 శాతం మందిని ఆర్మీలోకి తీసుకుంటామని తొలుత ప్రకటించిన కేంద్రం.. అప్పుడే మళ్లీ శిక్షణ ఉంటుందని ఎందుకు ప్రకటించలేదని.. ఈ పథకం నోట్ల రద్దు ఘటనను తలపిస్తుందని వారు విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more