విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా (85) పేరు తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి విపక్షాల అభ్యర్థిగా నిలపనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా తాము బరిలోకి దిగలేమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, జాతిపిత మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ సైతం పోటీలో నిలవబోమని ఇప్పటికే తేల్చి చెప్పారు.
దీంతో అధికారపక్ష అభ్యర్థికి పోటీగా తమ తరపున బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ యశ్వంత్ సిన్హా పేరును తెరపైకి తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు యశ్వంత్ సిన్హా ఉమ్మడి విపక్షాల అభ్యర్థిగా మారారు. ఈ మేరకు ఇవాళ శరద్ పవార్ నేతృత్వంలో ఢిల్లీలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది. దేశంలోని విపక్ష పార్టీలన్ని ఒకే తాటిపైకి వచ్చి.. యశ్వంత్ సిన్హాను గెలుపుకు కృషి చేయవల్సిందిగా తాము అన్ని పార్టీలను కోరనున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ తరుణంలో తమతో చేతులు కలిపిన తృణముల్ కాంగ్రస్ అధినేత్రి మమతాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మాజీ ఐఏఎస్ అయిన యశ్వంత్ సిన్హా 1984లో జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన గతేడాది ఆ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆయన టీఎంసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయికి అత్యంత సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వానికి ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాయని, మమతా బెనర్జీ కూడా అందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. బీజేపీని ఎదుర్కొనేందుకు సిన్హా పేరును వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more