ఇండియన్ ఆర్మీ.. ఎండా, వాన.. పగలు, చీకటి.. ఎడారులు, పర్వతాలు, హిమపాతాల్లోనూ అనునిత్యం గస్తీ కాస్తూ.. దేశంలోకి ఎవరూ చోరబడకుండా పహారా కాస్తుంటారు. వారికి ఎల్లవేళలా ప్రేరణ కల్పించేది జాతీయ జెండా.. దేశమా.? ప్రాణమా.?అంటే.. ప్రాణం తీయడానికే కాదు.. ఇవ్వడానికైనా వెనుకాడనివాడే సైనికుడు. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాధపీ కరీయసి అంటూ భరతమాత నిత్యం శాంతియుతంగా ఉండాలని దేశసేవకై సైన్యంలో చేరి.. కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా ఉంటూనే వారితో ఎనలేక ప్రేమబాంధవ్యాలను కొనసాగించేవాడే సైనికుడు.
శత్రువులకు ఎదురు నిలిచి ధైర్యసాహసాలు ప్రదర్శించడమే కాదు.. అవసరమైనపుడు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి పౌరులను కాపాడేవాడే సైనికుడు. ఆర్తనాథం వినిపించిన వెంటనే అభయహస్తాన్ని అందించి.. నేనున్నానంటూ అదుకునేవాడే సైనికుడు. ఇంతలా సైనికుల గురించి చెబుతన్నారేంటీ అంటే.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా బతకగలుతున్నారంటే అందుకు సైనికులే కారణం. ఇక తాజాగా భారత సైన్యం రంగంలోకి దిగి నలుగురు దేశపౌరుల ప్రాణాలను కాపాడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జమ్ముకశ్మీర్లోని సింధ్ నది సమీపంలో విహారయాత్ర కోసం బల్తాల్ ప్రాంతానికి నలుగురు యాత్రికులు వెళ్లారు.
వారు తమ వాహనంతో సింధ్ నదిని దాటాలని అనుకున్నారు. ఈ క్రమంలో నదిలో చిక్కుకున్నారు. దీంతో వారు అటు ఒడ్డుకు వెళ్లలేక, వెనక్కిపోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అందులోనే ఉండిపోయారు. అయితే ఇదే సమయంలో అమర్నాథ్ యాత్ర కోసం బాల్టాల్-డోమెల్ వద్ద మొహరించిన ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ బృందం నదిలో చిక్కుకున్న వాహనాన్ని గమనించింది. దీంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు అవసరమైన పరికరాలను తీసుకొని ఘటనా స్థలానికి చేరుకుంది. జేసీబీని ఉపయోగించి, వల సహాయంతో ఆ నలుగురు పౌరులను రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైనికులపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
#WATCH J&K | Indian Army rescues four people after their vehicle was stuck in Sind river near Baltal in Srinagar district
— ANI (@ANI) June 12, 2022
(Source: Indian Army) pic.twitter.com/raRYfSLUCg
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more