Tragedy in Khammam: Newlywed groom commitత suicide పెళ్లింట విషాదం: స్నానాల గదిలో వరుడు ఆత్మహత్య..

Tragedy in khammam newlywed groom commit suicide two days after marriage

Wedding tragedy in Khammam, newly wed groom commits suicide, newly wed groom suicide in Punyavaram, Wyra Mandal, Khammam, Crime

A wedding tragedy has taken place in Khammam district. The two families were plunged into deep tragedy when the newlywed groom committed suicide after the wedding and reception. The incident took place at Wyra Mandal Punyavaram in the district.

పెళ్లింట విషాదం: స్నానాల గదిలో వరుడు ఆత్మహత్య..

Posted: 06/07/2022 03:54 PM IST
Tragedy in khammam newlywed groom commit suicide two days after marriage

పెళ్లంటే సందెళ్లు, తప్పట్లు తాళాలు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు.. అని మన సినీ కవులు గేయాలు రాసినా.. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నవజంటలో ఎవరో ఒకరు ఆత్మహత్యలకు గురికావడం ఈ మధ్యకాలంలో తాజాగా వింటున్నాం. నూరేళ్లు తనతో ఉంటానని హామి ఇచ్చి ఒక్కటైన జంట.. అంతలోనే అనాధను చేసి వెళ్లిపోతున్నారు. దీంతో అసలేం జరుగుతుందో కూడా అర్థంకానీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పలు వెలుగుచూడగా, తాజాగా ఖమ్మం జిల్లాలో ఇదే తరహా ఘటన రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పెళ్లి రోజున సంతోషంగా కనిపించి.. ఇక తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ లోనూ ఆనందంగా వుండి.. ఆ మరుసటి రోజు నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పుణ్యవరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 4న వివాహమైంది. ఆ తర్వాతి రోజైన ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు.

తమ ఇంటివద్ద జరగిన విందు వేడుకలో నరేష్ ఆనందంగానే కనిపించాడు. తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సరదగా ఉన్నాడు. ఆ మరుసటి రోజున (జూన్ 6న) అందరూ కలిసి విజయవాడ సమీపంలోని గుణదల దైవదర్శనానికి వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం దైవదర్శనం కోసం వెళ్లేందుకు నవవరుడు నరేష్ బంధువుల కోసం క్యాబ్ లు కూడా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా ఆ మరుసటి రోజున తెల్లవారుజామున మూడు గంటలకే లేచి బంధువులను అందరినీ నిద్రలేపి ప్రయాణానికి సిద్ధం చేశాడు.

ఇక తాను స్నానం చేసి వస్తానంటూ బాత్రూమ్ లోకి వెళ్లాడు. అలా వెళ్లిన నరేష్ ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎమీటి ఇంతసేపు అంటూ అతడికి ఫోన్ చేశారు. అయితే నరేశ్ ఎంతకీ ఫోన్ తీయలేదు. దీంతో అనుమానం కలిగిన కుటుంబసభ్యులు..తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి వున్న నరేష్‌ను చూసి హతాశులయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకోవడంతో అతడు మరణించినట్టు నిర్ధారించారు. పెళ్లి రోజు, ఆ తర్వాత కూడా సంతోషంగానే కనిపించిన నరేష్ అంతలోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్నది అంతుచిక్కని విషయంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles