భారతీయుడి గుర్తింపునకు ఆధార్ నెంబరును కీలకంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) త్వరలో ఇంటింటికి ఆధార్ సేవ చేపట్టనున్నది. దీంతో ఇక ఇప్పటివరకు ఆధార్ కేంద్రాల వద్దకు ఉదయమే వెళ్లి అక్కడ టోకన్ తీసుకుని.. ఇక అక్కడే గంటల కొద్దీ సమయాన్ని క్యూ లైన్లో నిలబడి గడుపుతూ రావాల్సిన అవసరం ఇక లేదు. ఇప్పటికీ భారతీయులు ఇలాంటి సమస్యలను అధిగమించేలా దేశవ్యాప్తంగా పలు బ్యాంకులలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆధార్ సవరింపులు, నమోదు తదితర పనులను మరింత సులభతరం చేయనుంది ఉడాయ్. అందుకోసం ఈ సేవలకు ఇంటివరద్దకే తీసుకురానుంది.
ఇంటింటికి ఆధార్ సేవ కోసం యూఐడీఏఐ ఇప్పటికే 48 వేల మంది పోస్ట్మన్లకు శిక్షణ ఇచ్చింది. 12-డిజిట్ యూనిక్ ఆధార్ నంబర్ జారీ చేయాల్సిన బాధ్యత విశిష్ట ప్రాధికార సంస్థదే. ఈ ప్రక్రియ చేపట్టేందుకు దేశవ్యాప్తంగా పోస్ట్మన్లకు యూఐడీఏఐ శిక్షణ ఇస్తున్నది. ఈ శిక్షణతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)లోని పోస్ట్మన్లు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ఇంటింటికి తిరిగి మొబైల్ ఫోన్ నంబర్లతో ఆధార్ నంబర్ లింక్, డిటైల్స్ అప్డేట్, ఇండ్ల వద్ద పిల్లల పేర్ల నమోదు ప్రక్రియ చేపడతారు. అత్యధిక మంది వద్దకు ఆధార్ సేవలను తీసుకెళ్లడం.. పౌరులందరి పేర్ల రిజిస్ట్రేషన్ లక్ష్యంగా విశిష్ట ప్రాధికార సంస్థ విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్నది.
రెండో దశలో దేశవ్యాప్తంగా 1.50 లక్షల పోస్టాఫీసులను భాగస్వాములను చేయనున్నది. ఐపీపీబీ పోస్ట్మన్లతో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులో.. పిల్లల పేర్లను మొబైల్ బేస్డ్ కిట్తో టాబ్లెట్ ఉపయోగించి నమోదు చేస్తారు. లాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉపయోగించి మారుమూల ప్రాంతంలో ఆధార్ డిటైల్స్ అప్డేట్ చేయొచ్చు. ఐపీపీబీ పోస్ట్మన్లతోపాటు విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్తగా 13 వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా విశ్వాసంలోకి తీసుకోనున్నది. ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కామన్ సర్వీస్ సెంటర్తో పని చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more