కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం. ఇది మరోసారి రుజువైంది. అభంశుభం తెలియని అమాయక చిన్నారుల ప్రాణాలను హరించిన హంతకుడి తల్లి కూడా అదే పని చేసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం యువాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లను 18 ఏళ్ల బాలుడు సాల్వడార్ రామోస్ తుపాకీతో మట్టుబెట్టడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో రామోస్ కూడా మరణించాడు.
దీనిపై సాల్వడార్ రామోస్ కన్నతల్లి అడ్రినా మార్టినెజ్ స్పందించారు. ఓ టీవీ చానల్ తో ఆమె మాట్లాడుతూ.. ‘‘నన్ను క్షమించండి. నా కుమారుడిని కూడా క్షమించండి. నా కొడుకు చేసిన పనికి అతడి వైపు నుంచి కారణాలు ఉన్నాయి. అది నాకు తెలుసు. దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దు. ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారులు క్షమించాలనే నేను వేడుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అంతమందిని కాల్చి చంపడానికి కారణాలు ఏమున్నాయి? అని టీవీ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు.
సదరు నరహంతక బాలుడి తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చేసిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా కొడుకు ఎప్పుడూ కూడా ఇలాంటి చర్యకు దిగుతాడని ఊహించనే లేదు. అతడు అలాంటి పని చేయడానికి బదులు నన్ను చంపి ఉండాల్సింది. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను వారి తల్లిదండ్రులు ఎలా అయితే ఇక ఎప్పుడూ చూడలేరో.. నేను కూడా నా కొడుకును ఇంకెప్పుడూ చూడలేను. అదే నాకు బాధ కలిగిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్కూల్లో కాల్పులకు దిగడానికి ముందు సదరు బాలుడు ఇంటి వద్ద అమ్మమ్మపైనా తుపాకీతో విరుచుకుపడడం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more