పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని నెటిజనులు పలువురు పలురకాలుగా విమర్శలు సంధించారు. వీరిద్దరు చేసిన ఈ చర్యతో యావత్ ఐఏెఎస్ అధికారులకు విమర్శలను ఎదుర్కోనాల్సివచ్చింది. కాగా, ఇప్పడు అదే నెటిజనులు ఒక ఐఏఎస్ అధికారిణి చేసిన పనితో యావత్ దేశవ్యాప్త ఐఏఎస్ అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారిు.
అదే సోషల్ మీడియా వేదికగా ఐఏఎస్ అధికారి కీర్తి జల్లిపై కురుస్తున్న ప్రశంసలతో తెలుగు ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలను తనకు అన్వయించుకుని దేశంలోనే ఉన్నా తెలుగువారి గోప్పదనా్ని, కట్టుబాట్లను, అంకితభావాన్ని ఇప్పుడు అసోం ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ప్రజాసేవకై అంకిత భావంతో పనిచేస్తున్న ఆ ఐఏఎస్ అధికారిణి వృత్తినిబద్ధతపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె మరెవరో కాదు కీర్తి జల్లి. తెలుగు బిడ్డ.
అసోంలో ఐఏఎస్ అధికారిణి కీర్తి జల్లి మాత్రం అంకితభావం అందరితోనూ ప్రశంసలు అందుకుంటోంది. కాలి నడకన బురదలో నడుచుకుంటూ వెళ్లి వరద ప్రభావిత ప్రాంత వాసుల కష్టాలను వింటున్న ఆమె వృత్తినిబద్ధతపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఢిల్లీ ఐఏఎస్ అధికారుల జంటతో ఆమెను పోల్చుతూ కొనియాడుతున్నారు. తెలుగిు ఆడపడచు కీర్తి జల్లి అసోంలోని కఛార్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారారు. అసోంను వరదలు ముంచెత్తి.. కొండచరియలు విరిగిపడి.. అకాల వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
ఈ సమయంలో క్షేత్రస్థాయిలోకి స్వయంగా వెళ్లి.. నాటు పడవల సాయంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని అక్కడి దారులన్నీ కొండచరియల కారణంగా మూసుకుపోయి బురదమయంగా మారగా, అమె ఆ ప్రాంతాన్నింటినీ స్వయంగా పర్యటించి..అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. చీరకట్టులోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితుల గోడు విన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సాదకబాధకాలను ఓపిగ్గా విన్న కీర్తి జల్లి వారికి కావాల్సిన నిత్యావసరాలను సైతం పంపిణీ చేశారు.
వరదల నుంచి ఆయా ప్రాంతాలను రక్షించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె అంకితభావం, వృత్తి నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కీర్తి జల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఐఏఎస్ పూర్తైన తర్వతా అసోంలో వివిధ బాధ్యతల్లో పనిచేసిన కీర్తి.. మహిళలు, శిశు మరణాలను తగ్గించడానికి, వారి ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కొవిడ్ సమయంలో తన వివాహంతో కూడా వార్తల్లో నిలిచారు కీర్తి జల్లి. పెళ్లైన తర్వాత రోజే విధుల్లోకి వెళ్లి తన వృత్తినిబద్ధతను చాటుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more