స్కూలు యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై పాఠశాలకు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరూ చేసేవాళ్లే కానీ.. ఆ బాలికకు కావాల్సిన అదుకునే హస్తం మాత్రం రాలేదు. కాగా, ఈ వీడియో తెగ వైరల్ కావడంతో.. అమెకు ఏకంగా తీయటి కబురు అందింది. అదుకునే ఆపన్న హస్తం స్పందించి.. ఆ బాలికతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా టికెట్ పంపించి ఇక త్వరగా ప్రయాణం చేయాల్సిందిగా చెప్పింది. ఇంతకీ ఆ ఆపన్నహస్తం అందించింది ఎవరు అంటే.. వలస కార్మికుల దీనస్థితిని చూసి పట్టెడన్నం పెట్టడంతో పాటు బస్సులు వేసి వారిని వారివారి స్వగ్రామాలకు తరలించడంతో దేశవ్యాప్త ప్రజలకు సుపరిచితుడైన నటుడు సోనూ సూద్.
బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన సీమా అనే విద్యార్థిని ఓ ప్రమాదంలో తన కాలిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి అమె కొన్న రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తరువాత తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు వెళ్తానంది. దీంతో వారు సరేనన్నారు. అయితే ఒంటికాలితో ఎలా అని మదనపడ్డారు. ప్రారంభంలో వారు తోడుగా వెళ్లారు. అయితే రాను రాను అలవాటు చేసుకన్న బాలిక.. ప్రతిరోజూ కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు అలాగే ఒంటికాలిపై గెంతుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ కంటపడింది. త్వరలోనే ఆమెకు సహాయం చేయనున్నట్లు సోనూసూద్ ప్రకటించాడు.
ఓ రోడ్డుప్రమాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయిందని స్థానిక మీడియా పేర్కొంది. అయినా, చదువుకోవాలని ఆమె తపనముందు వైకల్యం ఓడిపోయింది. ఒంటికాలిపై గెంతుతూ తన లక్ష్యాన్ని సాధించేందుకు స్కూల్ బాటపట్టింది. ఆ విద్యార్థినికి చదువుపై ఉన్న శ్రద్ధ సోనూసూద్ను కట్టిపడేసింది. ‘ఇక నువ్వు స్కూల్కు ఒక కాలిపై గెంతుకుంటూ వెళ్లవు. టికెట్స్ పంపిస్తున్నా వచ్చేయ్.. నువ్వు రెండు కాళ్లపై చెంగుచెంగున స్కూల్కు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి సోనూసూద్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more