కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) కొత్త చీఫ్ అబు అల్ హసన్ అల్ ఖురేషీ టర్కీలోని ఇస్తాంబుల్లో పోలీసులకు చిక్కాడు. వాయవ్య సిరియాలో టర్కీ ఆధిపత్య తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ఇడ్లిబ్లోని ఓ ఇంట్లో ఉన్న ఐసిస్ చీఫ్ను అమెరికా సేనలు మట్టుబెట్టిన తర్వాత అబూ అల్ హసన్ను కొత్త ‘ఖలీఫ్’గా ఐసిస్ ప్రకటించింది. ఐసిస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే ఇప్పుడు పోలీసు ఆపరేషన్లో అతను పట్టుబడడం గమనార్హం.
ఇస్తాంబుల్ పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగాల నేతృత్వంలో రాజధానిలో నిర్వహించిన ‘అత్యంత రహస్య ఆపరేషన్లో టర్కీ భద్రతా దళాలు అబూ హసన్ను అరెస్టు చేసినట్లు టర్కీ న్యూస్ వెబ్సైట్ ‘ఒడా టీవీ’ పేర్కొంది. ఐసిస్ చీఫ్ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్కు తెలియజేశాయని, త్వరలోనే ఆయనీ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని వెబ్సైట్ వివరించింది. ఐసిస్ ప్రాబల్యం మధ్యప్రాచ్యంలో క్రమంగా క్షీణిస్తోంది.
2019లో దాని చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ మరణించిన తర్వాత అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ ఉగ్రవాద సంస్థ బాధ్యతలు చేపట్టాడు. అయితే, వాయవ్య సిరియాలో అమెరికా భద్రతా బలగాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ నిర్వహించాయి. కానీ, అమెరికా బలగాలకు చిక్కకుండా అబూ ఇబ్రహీం తనను తాను బాంబులతో పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడితోపాటు ఆయన కుటుంబం కూడా తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు కొత్త చీఫ్ అయిన అబుల్ అల్ హసన్ ఇస్తాంబుల్లో పట్టుబడడం ఐసిస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more