ఈజీ మనీవేటలో సైబర్ నేరగాళ్లు వేసే కొత్త ఎత్తులు.. ఔరా అనిపించేలా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయినా వీళ్లు దొంగలే. దొంగలు రహస్యంగా రెక్కీ నిర్వహించి ఇంటికి కన్నాలు వేయడం, జేజులు కొట్టేయడం, మోసలు చేయడం లాంటి గారడీ విద్యలతో మోసం చేస్తే.. వీరు.. ఏకంగా తమ ఇళ్లలోంచి కాలు కూడా కదపకుండా మోసాలు చేస్తారు. అయితేనేం వీళ్లు కూడా ఆ జాబితాలో చేరే కేటుగాళ్లే. వీళ్లూఎప్పుడో ఒక్కపుడు దొరక్క తప్పదు. కటకటాలు లెక్కించక తప్పదు. సాంకేతికతను అత్యంత చాకచక్యంగా వాడే తెలివి ఉన్నప్పుడు.. వీరు ఎందుకనో వాటిని సక్రమమైన మార్గంలో పెట్టడం లేదో ఎవరికీ అర్థంకాదు.
కొత్త పంథాల్లో డబ్బు దోచుకుంటున్న వీరు.. ఆ డబ్బును అవతలి వ్యక్తి ఎంతగా శ్రమించి కూడబెడుతున్నాడో కూడా తెలుసుకుంటే.. అప్పుడు ఎదుటి వారి నుంచి ఊరికే డబ్బులు అడగాలన్నా బాధ అనిపిస్తుంది. కానీ ఉడుకు రక్తం వక్రమార్గం భాట పట్టిస్తుంది. ఆ జోష్ లో సైబర్ నేరాలకు పాల్పడి ఎదుటివారి డబ్బును కోట్టేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మరో కొత్త పంథా తాజాగా వెలుగుచూసింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు కాజేశారు. అతడికి అసలు పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బు కొట్టేయడం విశేషం. పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బులు కాజేసిన ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. రూ.20వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు.
ఇలాంటి కేసును ఎప్పుడూ చూడని బ్యాంకు సిబ్బంది, పోలీసులు.. ఏం చేయాలా అని తలపట్టుకుంటున్నారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..అనీస్ రహ్మాన్.. కేరళ మలప్పురం జిల్లా వండూర్ వాసి. బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.20వేల రూపాయలు విత్డ్రా అయినట్లు తెలిసింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. మూడు సందర్భాల్లో పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు తనకు పేటీఎం అకౌంట్ లేదని, ఈ బ్యాంకు ఖాతాతో లింక్ కాలేదని అనీస్ చెప్పాడు.
ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కేసు రావడం తమకు తొలిసారని బ్యాంకు అధికారులు చెప్పారు. యూపీఐ సంబంధిత వివాదాలన్నీ బ్యాంకు ఐటీ విభాగం పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నగదు బదిలీ జరిగి ఉంటే.. తిరిగి ఇచ్చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారం మోసపూరితంగా కనిపిస్తున్నందున.. సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందన్న అనుమానంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు ఈ మోసానికి ఎలా పాల్పడి ఉంటారా అని అధికారులు, పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికతో ఇలా చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. తొలుత ఒక్క రూపాయి మాత్రమే బదిలీ చేసి, ఆ తర్వాత రూ.9999, మూడోసారి రూ.8635 ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉన్న స్టేట్మెంట్ సహా ఇతర అంశాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more