ఈజీ మనీవేటలో సైబర్ నేరగాళ్లు వేసే కొత్త ఎత్తులు.. ఔరా అనిపించేలా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయినా వీళ్లు దొంగలే. దొంగలు రహస్యంగా రెక్కీ నిర్వహించి ఇంటికి కన్నాలు వేయడం, జేజులు కొట్టేయడం, మోసలు చేయడం లాంటి గారడీ విద్యలతో మోసం చేస్తే.. వీరు.. ఏకంగా తమ ఇళ్లలోంచి కాలు కూడా కదపకుండా మోసాలు చేస్తారు. అయితేనేం వీళ్లు కూడా ఆ జాబితాలో చేరే కేటుగాళ్లే. వీళ్లూఎప్పుడో ఒక్కపుడు దొరక్క తప్పదు. కటకటాలు లెక్కించక తప్పదు. సాంకేతికతను అత్యంత చాకచక్యంగా వాడే తెలివి ఉన్నప్పుడు.. వీరు ఎందుకనో వాటిని సక్రమమైన మార్గంలో పెట్టడం లేదో ఎవరికీ అర్థంకాదు.
కొత్త పంథాల్లో డబ్బు దోచుకుంటున్న వీరు.. ఆ డబ్బును అవతలి వ్యక్తి ఎంతగా శ్రమించి కూడబెడుతున్నాడో కూడా తెలుసుకుంటే.. అప్పుడు ఎదుటి వారి నుంచి ఊరికే డబ్బులు అడగాలన్నా బాధ అనిపిస్తుంది. కానీ ఉడుకు రక్తం వక్రమార్గం భాట పట్టిస్తుంది. ఆ జోష్ లో సైబర్ నేరాలకు పాల్పడి ఎదుటివారి డబ్బును కోట్టేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మరో కొత్త పంథా తాజాగా వెలుగుచూసింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు కాజేశారు. అతడికి అసలు పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బు కొట్టేయడం విశేషం. పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బులు కాజేసిన ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. రూ.20వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు.
ఇలాంటి కేసును ఎప్పుడూ చూడని బ్యాంకు సిబ్బంది, పోలీసులు.. ఏం చేయాలా అని తలపట్టుకుంటున్నారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..అనీస్ రహ్మాన్.. కేరళ మలప్పురం జిల్లా వండూర్ వాసి. బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.20వేల రూపాయలు విత్డ్రా అయినట్లు తెలిసింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. మూడు సందర్భాల్లో పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు తనకు పేటీఎం అకౌంట్ లేదని, ఈ బ్యాంకు ఖాతాతో లింక్ కాలేదని అనీస్ చెప్పాడు.
ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కేసు రావడం తమకు తొలిసారని బ్యాంకు అధికారులు చెప్పారు. యూపీఐ సంబంధిత వివాదాలన్నీ బ్యాంకు ఐటీ విభాగం పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నగదు బదిలీ జరిగి ఉంటే.. తిరిగి ఇచ్చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారం మోసపూరితంగా కనిపిస్తున్నందున.. సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందన్న అనుమానంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు ఈ మోసానికి ఎలా పాల్పడి ఉంటారా అని అధికారులు, పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికతో ఇలా చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. తొలుత ఒక్క రూపాయి మాత్రమే బదిలీ చేసి, ఆ తర్వాత రూ.9999, మూడోసారి రూ.8635 ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉన్న స్టేట్మెంట్ సహా ఇతర అంశాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more