3 Terrorist killed in encounter with security forces in J&K జమ్మూలోని కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..

Three pakistani terrorist killed in encounter with police forces in j k s kupwara

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Kupwara encounter, jumaghand village encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, jumaghand encounter JK, Jammu encounter, CRPF forces, Jammu Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Kupwara, Jammu and Kashmir, National politics

Three Pakistani terrorists were gunned down during an encounter in Jammu and Kashmir's Kupwara district on Thursday, police said. A Jammu and Kashmir policeman was also martyred during the operation which began in the morning.

జమ్మూలోని కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..

Posted: 05/26/2022 03:39 PM IST
Three pakistani terrorist killed in encounter with police forces in j k s kupwara

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాయి. రాష్ట్రంలోని ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలోగల కుప్వారా జిల్లాలోని జుమాగండ్ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారత భద్రత బలగాలు పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. కుప్వారా జిల్లాలోని జుమాగండ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా జరిపిన సెర్చ్‌ ఆపరేషన్‌ పసిగట్టిన ఉగ్రవాదులు.. గాలింపు బృందంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ చెప్పారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జుమాగండ్ గ్రామంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపాయి. ఈ ప్రతిదాడుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ మేరకు కాశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు. కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు ప్రతీగా జరిపిన కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా, నిన్న బరాముల్లా జిల్లాలోని ఖేరి ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను లొంగిపోవాలని సూచించినా.. కాల్పులకు తెగబడటంతో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. స్థానిక పోలీసులు.. భద్రతాదళాలతో కలసి ఖేరీ ప్రాంతానికి చేరుందుకు వెళ్తుండగా, నాజీభట్ క్రాసింగ్ వద్దకు చేరుకున్న తరువాత ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ వీరమరణం పోందాడు.

 కాగా, బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలో ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్‌ భట్‌ తన మేనల్లుడు ఫర్హాన్‌ జుబైర్‌ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె మరణించగా, తీవ్రంగా గాయపడిన జుబైర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా వీర మరణం పొందిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles