అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కలకలం రేపింది. అగ్రరాజ్యంలోని టెక్సాస్ నగరం, ఉవాల్డేలోని ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు తుపాకీతో పాఠశాలలోని తరగతి గదిలోకి ప్రవేశించి.. 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపిన విషాదంలో రక్తపు మరకలు కూడా చల్లారక ముందే మరో విద్యార్థి తుపాకీతో అదే టెక్సాస్ నగరంలోని పాఠశాలల వద్ద సంచరించడం తీవ్ర కలకలం రేపింది. 21 మంది పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు గాలిలో కలసి 24 గంటలు కూడా గడవకముందే మరో విద్యార్థి తుపాకులతో సంచరించడం గమనార్హం.
టెక్సాస్లోని రిచర్డ్సన్ స్కూల్లో ఓ హైస్కూల్ విద్యార్థి తుపాకీతో తిరుగుతున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన తరలివచ్చిన వారు ఓ యువకుడిని అదుపులోకి తీసుకన్నారు. అయితే అతని వద్ద తుపాకులు ఏమీ లేవని. కాగా అతని కారులో మాత్రం ఒక రైపిల్, ఒక తుపాకీ లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే పోలీసులు ఈ యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, అమెరికాలోని టెక్సాస్లో ఉవాల్దేలో సాల్వడోర్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు ఉన్మాదానికి పాల్పడి ఏకంగా 21 మందిని హతమార్చిన ఘటన తెలిసిందే. కాగా తన పుట్టిన రోజు సందర్భంగా తుపాకీ కొనుగోలు చేసిన రామోస్.. ముందు తన నానమ్మను కాల్చిచంపి.. ఆ తరువాత రాబ్ స్కూల్ లోకి వెళ్లి అక్కడ దాదాపుగా నలబై నిమిషాల నుంచి గంట పాటు అదే స్కూల్ లో ఉండి.. ఒక తరగతి గదిలోకి వెళ్లిన తరువాత అక్కడ ముక్కుపచ్చలారని చిన్నారులపై విఛక్షణా రహితంగా కాల్పులు జరిపాడు, ఈ కాల్పుల్లో 21 మంది మరణించగా వారిలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. కాగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకుడు హతమైన విషయం తెలిసిందే.
కాగా, నిన్న జరిగిన ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినబడతున్నాయి. పోలీసులు స్కూలు అవరణకు చేరుకున్నా.. లోనికి వెళ్లడానికి మాత్రం మీనమేషాలు లెక్కించారని, అందుకనే ఈ దారుణఘటన ఉత్పన్నమయ్యిందన్న విమర్శలు వినిపించాయి. దుండగుడి దాడిలో తమ బిడ్డ జాక్లీన్ కాజారెస్ ను కోల్పోయిన బాధితులు స్పందిస్తూ.. పాఠశాల అవరణలో కాల్పుల శబ్దం వినిపిస్తున్నా.. పోలీసులు గుమ్మిగూడారే తప్ప లోనికి వెళ్లలేదని తెలిపారు.
రామోస్ తన ట్రక్కును స్కూల్ దగ్గర ఢీకొట్టడంతో పాటు పొరుగున ఉన్న అంత్యక్రియల ఇంటి ఆవరణలోని ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడం చూసిన మహిళలు.. పోలీసు అధికారులు చేరుకోగానే “అక్కడికి వెళ్లండి! అక్కడికి వెళ్లండీ!" అని అరిచినా పోలీసులు వివాదాస్పద సమయపాలన సంకేతాలను అందించారని వారు తెలిపారు. టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ మాట్లాడుతూ, రామోస్ మొదటిసారి పాఠశాల భద్రతా అధికారిపై కాల్పులు జరిపినప్పుడు-ఆ తర్వాత కాల్పులు జరపడానికి మధ్య నలభై నుంచి గంట పాటు సమయం తీసుకోన్నాడని తెలిపారు. భవనం వెలుపల ఉన్న ఇద్దరు ఉవాల్డే పోలీసు అధికారులు, చివరకు రామోస్ను తుదముట్టించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more