ఠారెత్తిస్తున్న ఎండల నుంచి తెలుగు రాష్ట్రాలు గత నాలుగు రోజులుగా ఉపశమనం పోందాయి. అసని తుపాను ప్రభావంతో తెలుగురాష్ట్రాలు చల్లబడ్డాయి. అయితే అసని తుపాను చల్లబడిన తరువాత మళ్లీ ఎండలు భగభగమండతున్నాయి. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ 'చల్లటి' కబురు చెప్పింది. ఈ ఏడాది.. నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా ముందుగానే వస్తాయని అంచనావేసింది. అసని తుపాను ప్రభావం కూడా రుతుపవనాలు నిర్ణీతం కన్నా వారం రోజుల ముందే.. దేశంలోకి ప్రవేశించేందుకు దోహదం చేశాయని పేర్కొంది. సాధారణంగా మే చివరి వారంలో అండమాన్ నికోబార్ దీవులను చుట్టి.. జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి.
ఈసారి ఈ ప్రక్రియ కాస్త ముందుగానే జరుగుతుందని ఐఎండీ అంచనా వేసింది. "అనుకున్న దానికన్నా ముందే.. దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చూట్టేయవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ మే 22 వరకు జరగాల్సి ఉంది. ఇక ఈఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నాము, " అని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అదే సమయంలో ఐదురోజుల పాటు కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అండమాన్ దీవుల్లో రుతుపవనం ప్రవేశించడం.. దేశంలో నాలుగు నెలల వర్షాకాలనికి సూచన. ఇక రుతుపవనాలు కేరళను తాకినప్పుడు వానాకాలం మొదలైనట్టు భావిస్తారు.
అసని తుపాను ప్రభావంతో దక్షిణ భారతంలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. కానీ భానుడి భగభగలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. రాజస్థాన్ బార్మేర్లో గురువారం ఏకంగా 48డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్లోని 29 నగరాలు, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య భారతంలో మరో 2-3రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more