ఠారెత్తిస్తున్న ఎండల నుంచి తెలుగు రాష్ట్రాలు గత నాలుగు రోజులుగా ఉపశమనం పోందాయి. అసని తుపాను ప్రభావంతో తెలుగురాష్ట్రాలు చల్లబడ్డాయి. అయితే అసని తుపాను చల్లబడిన తరువాత మళ్లీ ఎండలు భగభగమండతున్నాయి. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ 'చల్లటి' కబురు చెప్పింది. ఈ ఏడాది.. నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా ముందుగానే వస్తాయని అంచనావేసింది. అసని తుపాను ప్రభావం కూడా రుతుపవనాలు నిర్ణీతం కన్నా వారం రోజుల ముందే.. దేశంలోకి ప్రవేశించేందుకు దోహదం చేశాయని పేర్కొంది. సాధారణంగా మే చివరి వారంలో అండమాన్ నికోబార్ దీవులను చుట్టి.. జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి.
ఈసారి ఈ ప్రక్రియ కాస్త ముందుగానే జరుగుతుందని ఐఎండీ అంచనా వేసింది. "అనుకున్న దానికన్నా ముందే.. దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చూట్టేయవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ మే 22 వరకు జరగాల్సి ఉంది. ఇక ఈఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నాము, " అని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అదే సమయంలో ఐదురోజుల పాటు కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అండమాన్ దీవుల్లో రుతుపవనం ప్రవేశించడం.. దేశంలో నాలుగు నెలల వర్షాకాలనికి సూచన. ఇక రుతుపవనాలు కేరళను తాకినప్పుడు వానాకాలం మొదలైనట్టు భావిస్తారు.
అసని తుపాను ప్రభావంతో దక్షిణ భారతంలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. కానీ భానుడి భగభగలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. రాజస్థాన్ బార్మేర్లో గురువారం ఏకంగా 48డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్లోని 29 నగరాలు, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయువ్య భారతంలో మరో 2-3రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more