రైల్వే స్టేషన్ల వద్ద కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం చేస్తూ పలువురు ప్రయాణికులు రైలు అందుకోవాలన్న అత్రృతలో ప్రమాదాల బారిన పడటం మనకు తెలిసిందే. అయితే పట్టాలు దాటుతుండగా కొందరు... కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరికొందరు కూడా ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే రైల్వే స్టేషన్ల వద్ద ప్రమాదాలు జరిగిన సమయాల్లో రైల్వేఅధికారులు దానిని నిలిపివేయడం సాధారణం. కానీ కదులుతూ వెళ్తున్న రైలులోంచి ప్రయాణికులు కిందపడితే.. వారిని కోసం రైలు అగటం ఇప్పటివరకు వినలేదు. కానీ తాజాగా మధ్యప్రదేశ్లో ఓ ప్రయాణికుడి కోసం రైలు ఆగడం కాదు.. ఏకంగా రెండు రిలోమీటర్ల దూరం వెనక్కువచ్చి మరీ అసుపత్రికి తరలించింది.
మద్యప్రదేశ్ లో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. ప్రయాణికుడికి తక్షణ సాయం అందించాలన్న ఉద్దేశ్యంతో అదే రైలును వెనక్కు వెళ్లి ఆపన్నహస్తం అందించాలని సూచించారు. ఇక ఆ మార్గంలో వేరే రైళ్లు రాకుండా చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే రైలు 2 కి.మీ. ముందుకు వెళ్లిన రైలు.. అదే మార్గంతో వెనక్కి వెళ్లింది. తీవ్రగాయాలతో పట్టాలపై పడిఉన్న బాధితుడిని రైలులో ఎక్కించుకుని వచ్చి సకాలంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన తపతి గంగా ఎక్స్ప్రెస్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీర్జాపూర్ జిల్లా వింధ్యాచల్ గ్రామానికి చెందిన 19ఏళ్ల దీపక్ .. తన మామతో కలసి పనినిమిత్తం గుజరాత్లోని సూరత్కు వెళ్తున్నాడు. ఇందుకోసం వారు తపతి గంగా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. రైలు కొద్ది దూరం వెళ్లాక.. తన సీటులో నుంచి లేచిన దీపక్.. ప్రయాణికులు ఎక్కే ద్వారం వద్ద కూర్చున్నాడు. ఆ తర్వత మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాలోని చర్ఖేడా స్టేషన్ సమీపంలో నిద్రలోకి జారుకున్న దీపక్ హఠాత్తుగా రైలు నుంచి ట్రాక్పై పడిపోయాడు. రైలు నుంచి ఓ ప్రయాణికుడు కిందపడిపోయాడని తెలిసి.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ప్రమాదవశాత్తు ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు సకాలంలో స్పందించారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు... మళ్లీ అదే రైలును వెనక్కి పంపించారు. దీపక్ కింద పడిపోయాక.. రైలు దాదాపు రెండు కి.మీ. ముందుకెళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకెళ్లి.. తీవ్ర గాయాలతో రైల్వే ట్రాక్పై పడి ఉన్న దీపక్ని ట్రైన్లో ఎక్కించారు. ఆ తర్వాత హర్దా రైల్వే స్టేషన్లో దింపారు. అక్కడి నుంచి హర్దా జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భోపాల్కు షిప్ట్ చేశారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more