Andhra man carries son's body on bike for 90 km తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.!

Denied ambulance man carries 10 year old son s body on motorcycle in tirupati

man carries son corpse on bike, man carries son dead body on bike, corpse carried on two wheelers, Tirupati RUIA hospital, son dead body, Ambulance drivers, Huge amount, Chitwel Mandal, Annamayya district, Tirupati, Andhra Pradesh

A man from Tirupati, Andhra Pradesh was forced to carry his son's dead body on a two-wheeler after the ambulance drivers at Sri Venkateswara Ramnarayan Ruia Government General (RUIA) hospital allegedly demanded a huge amount from him. The incident took place on Monday night at RUIA government Hospital of Tirupati where a 10-year-old boy from Chitwel Mandal village of Annamayya district died after treatment.

ITEMVIDEOS: తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.!

Posted: 04/26/2022 03:00 PM IST
Denied ambulance man carries 10 year old son s body on motorcycle in tirupati

ప్రజల అరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని అందుకనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలను మరింత పకడ్బంధీగా రాష్ట్రంలో అమలు చేస్తామని అధికార వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది. అయితే రాష్ట్రంలో అందునా టెంపుల్ సిటీ నగరంగా పేరుగాంచిన తిరుపతిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్థానిక అంబులెన్స్ డ్రైవర్లు కూటిమిగా ఏర్పడి అంబులెన్స్ సేవలను కూడా సామాన్యులకు అందనిద్రాక్షాగా మారుస్తున్నారు.

ఈ క్రమంలో రుయా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన బిడ్డ శవాన్ని మోటార్ సైకిల్ పైనే తన స్వగ్రామానికి తరలించాల్సిన అవసరం దాపురించింది. అందుకు కారణం అంబులెన్సు డ్రైవర్లే. పెరుగుతున్న ఇంధన ధరలను సాకుగా చూపుతూ.. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తమకు తాము చార్టుగా వేసుకుని దందా చేస్తూ పేదల రక్తాన్ని తాగుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు.. శవాలుగా ఎప్పుడు మారుతారా..? వారి నుంచి ఎలా డబ్బులు రాబడదామా.? అని శవాల మీద వ్యాపారం చేస్తూ గోతికాక నక్కల్లా మారుతున్నారని అనేందుకు ఈ ఘటనే నిదర్శనం.

కొడుకు చనిపోయిన పెట్టెడు బాధలో ఉన్న ఓ తండ్రి.. తన బిడ్డ మృతదేశాన్ని తన స్వగ్రామానికి తరలించేందుకు తన దుఃఖాన్ని దిగమింగుకుని.. ప్రయత్నించిన తండ్రికి నిరాశే ఎదురైంది. అసలే బాధతో గుండె బరువెక్కిన ఆ తండ్రిని అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. ఏకంగా పది వేల రూపాయల చార్జీని అగడటం.. అతడ్ని తీవ్రంగా బాధించింది. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేలు డిమాండ్ చేయడంతో ఆంతమేర చెల్లించలేని తండ్రి తన ద్విచక్రవాహనంపైనే తన కొడుకు మృతదేహాన్ని తరలించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యింది.

అంతటితో ఆగని అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. తమ గ్రామస్థులకు ఈ సమాచారం తెలిసి.. ఉచిత అంబులెన్సు ను ఆసుపత్రికి పంపించినా.. డ్రైవర్ ను బెదిరించి తన్ని తరిమేశారు. దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని విషణ్ణ వదనంతోనే బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పనిచేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు. అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు.

అంబులెన్సు డ్రైవర్లు రూ.10 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు. ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్సు డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు కొట్టారు. అక్కడి నుంచి పంపించేశారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరదీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక బైక్ పైనే కొడుకు మృతదేహాన్ని తరలించాడు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, అయినా కూడా అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles