ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రాత్రి ఏకాంతంగా మాట్లాడేందుకు రాగా.. అమె ప్రియుడి ఎదుటే యువతిని మానవమృగాలు సామూహిక అత్యాచారం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాలో విజయవాడలోని కృష్ణానది ఇసుక దిబ్బల వద్ద జరిగిన ఘటనను గుర్తుచేసేలా ఉన్న ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు యువతిని గమనించి తమ వాహనాన్ని అపారు. బస్టాప్ లోకి వెళ్లి చూడగా యువతి ఒంటరిగా కూర్చోని ఏడుస్తుండటంతో.. విచారించిన పోలీసులకు అమె జరిగిన దారుణ ఘటనను తెలిపింది. టాహుటిన మహిళా కానిస్టేబుల్ ను రప్పించిన పోలీసులు అమెనిచ్చి బాధితురాలిని కడలూరు ప్రభుత్వ అసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపింది.
తన బాయ్ఫ్రెండ్ కోట్టి అతని ముందే తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు బాధితురాలిని బెదిరించారు. అనంతరం యువతి బాయ్ఫ్రెండ్ సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. కాగా రేపు ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి పిర్యాదు చేద్దామని అమె ప్రియుడు చెప్పి తనను తమ ఇంటి వద్దనున్న బస్టాప్ లో వదిలి వెళ్లాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో యువతిని పోలీసులు కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించి చికిత్సను అందిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
కడలూరులోని కమ్మియమ్ పెట్టాయ్లో బాధిత యువతి.. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి అక్కడి బస్టాప్ కు కొద్దిదూరంలో వున్న శిధిలావస్థలో వున్న ఓ భవనం వద్ద కలుసుకుని మాట్లాడుకునేవారు. అయితే వీరని గత కొంతకాలంగా గమనిస్తున్న మానవమృగాలు వారిపై స్కెచ్ వేశాయి. కాగా, సోమవారం రాత్రి వారిద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన కామాంధులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించారు. ఆ తరువాత వారి నుంచి సెల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులతో పాటు డబ్బును కూడా లాగేసుకున్నారు. ఆ తరువాత వారు అమె బాయ్ ఫ్రెండ్ పై దాడి చేస్తుండగా, మరో వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమెను బస్టాప్ వద్ద వదిలిన అమె బాయ్ ప్రెండ్ ఉదయాన్నే పోలీసుల వద్దకు వెళ్దామని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో కమ్మియమ్పెట్టాయ్లో మార్చి 28న రాత్రిపూట గస్తీ నిర్వహించిన పోలీసులు.. యువతి బస్స్టాప్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ప్రశ్నించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులు కిశోర్(19), సతీశ్(19), ఆరిఫ్(18)ను అరెస్ట్ చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డీఐజీ పాండియన్, కడలూరు డీఎస్పీ శక్తి గణేశ్.. ముగ్గురు యువకులను విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more