జమ్మూకాశ్మీర్ లో నిత్యం ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనునిత్యం సరిహద్దు జిల్లాల్లో కాల్పుల మోత మ్రోగిస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ భారత భద్రతా బలగాలు కూడా కాల్పులతో ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. తాజాగా నిన్నరాత్రి నుంచి జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉగ్రవాదులు కాల్పులకు జరపగా, దానికి ప్రతిగా భారత భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లోని రైనావారీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. రైనావారీ ప్రాంతంలో స్థానిక పోలీసులు, భార్డర్ సెక్యూరిటీ సిబ్బంది జాయింట్ గా కూంబింగ్ సహా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్థానికంగా నక్కి వున్న ఉగ్రవాదులు, భద్రతా బలగాలను చూసి వారిపై కాల్పులకు దిగారు. దీంతో ఊహించిన పరిణామాలను ఎదురుకావడంతో తేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాద కాల్పులను తిప్పికొట్టాయి. కాగా సైన్యం ప్రతిదాడులలో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు.
వీరిద్దరూ పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులని భారత భద్రతా బలగాలు తెలిపాయి. కాగా, చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద ప్రెస్ కార్డు ఉన్నట్లు కశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఐడీ కార్డులో అతని పేరు రయీస్ అహ్మద్ భట్ అని, వ్యాలీ మీడియా సర్వీస్ అనే ఆన్లైన్ న్యూస్ పోర్టల్ చీఫ్ ఎడిటర్ అని ఉన్నట్లు విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఉగ్రవాద నేరాలకు సంబంధించి అతనిపై గతంలోనే రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు వెల్లడించారు. మరో ఉగ్రవాదిని బిజ్బెహరాకు చెందిన హిలాల్ అహ్రాహ్గా గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more