రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగం అంటూనే.. వారిని అందోళన బాట పట్టించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యాలతో కూడిన వేతన సవరణలు చేయడంతో ఉద్యోగులు అందోళన బాట పట్టాల్సివచ్చిందని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని ఉపాద్యాయులు ఇంకా తమ డిమాండ్లు పరిష్కారించాలని నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతూనే ఉన్నారని, వాటిని పరిష్కరించడం మాని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం వైసీపీ పార్టీ ఎత్తుగడలో భాగమేనని అన్నారు.
అధికారంలో వున్నాం కదా అని.. ప్రతిపక్ష పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ప్రజలకు సుపరిపాలన అందించేపనిలో వారుండాలని సూచించారు. ఉద్యోగుల సమస్య తాము సృష్టించింది కాదని, ఇతర విపక్షాలు సృష్టించిందీ కాదని.. జనసేన సోషల్ మీడియా టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్పష్టంచేశారు. పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, జీతాలు పెంచుతామని ఉద్యోగులకు చాలా ఆశలు కల్పించారని ఆరోపించారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని, వేతన సవరణను అమలు చేయమని అడుగుతున్నారని తెలిపారు.
ఉద్యోగులకు కడుపుమండి లక్షలాది మంది రోడ్లపైకి వస్తే, దానికి జనసేనను, ఇతర పార్టీలను నిందించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఏంచేసినా సరే డూడూ బసవన్నలా తలూపుతూ వెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ మంత్రివర్గంలో ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, మీరు ఇచ్చిన హామీలు తప్పినందువల్లే ఉద్యోగులు ఆందోళనలు తెలుపుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. అంతేతప్ప వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు తమను దూషించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, వైసీపీ నేతలు వెటకారాలు ఆపి పని చూడాలని హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more