రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్న అర్టీసీ అందరికీ సుపరిచితమే. ఇక ఈ సంస్థలో విధులు నిర్వహించే కార్మికులకు కొన్నాళ్ల కిందటే ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తింపును కల్పించిందీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందులోనూ విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఎవరైనా అడ్డగించినా.. అటంకం కల్పించినా అది నేరమే. అయితే ఓ మహిళ మాత్రం ఆటకం కల్పించడమే కాదు.. ఏకంగా తన స్కూటీని బస్సుకు అడ్డంగా పెట్టి.. బస్సు ఎక్కి డ్రైవర్ పై దాడికి పాల్పడింది. చోక్కా పట్టుకుని బస్సు దిగు అంటూ నానారభస చేసింది. అంతటితోనూ శాంతించని ఆమె ఏకంగా గేర్ బాక్సు పైకి ఎక్కి డ్రైవర్ ను కాలితోనూ తన్నింది.
రోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు వచ్చి మహిళను దిగాల్సిందిగా కోరినా.. అమె దిగలేదు సరికదా.. వారి ముందే దాడి చేస్తూ హంగామా సృష్టించింది. ఓ వైపు బస్సులోని మహిళా కండక్టర్, బస్సులోని ప్రయాణికులు దిగవమ్మా అని చెబుతున్నా పట్టించుకోని అమెను.. మహిళా కండక్టర్ బలవంతంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం ప్రకారం.. క్రితంరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ విద్యాధరపురం డిపోకు చెందిన బస్సు ప్రకాశం రోడ్డులో వెళ్తోంది.
అదే సమయంలో ఆంధ్రా ఆసుపత్రి సమీపంలో కృష్ణలంక తారకరామానగర్కు చెందిన నందిని అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డం వచ్చింది. డ్రైవర్ ముసలయ్య సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు ఆమె ద్విచక్ర వాహనం సమీపంలోకి వచ్చి ఆగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ వెంటనే బస్సెక్కి డ్రైవర్పై దాడిచేసింది. చొక్కా పట్టుకుని లాగి చింపేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. కాలితో తన్నింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, మహిళను పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మహిళపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
A woman biker dealt with a city bus driver in #Vijayawada like this, complaining that the bus had hit her bike.
— P Pavan (@PavanJourno) February 9, 2022
Women passengers in the bus made unsuccessful efforts to convince her to deal with legally.#AndhraPradesh pic.twitter.com/69tgcxzYNw
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more