ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అందులోనూ యావత్ దేశం దృష్టితో పాటు ప్రపంచాన్ని రాజకీయ పర్యవేక్షకులను అత్యంతగా ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ రోజున లేదా.. ఆ తరువాత వాహనదారులకు పెద్దస్థాయిలో షాక్ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమైందని ఇప్పటికే ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో తుది విడత ఎన్నికల పోలింగ్ కి ఒక్క రోజు ముందు లేదా.. అదే రోజున దేశంలో భారీస్థాయిలో ఇంధన ధరలను పెంచే అవకాశాలు వున్నాయిన్న వార్తలు వాహనదారుల్లో వణుకుపుట్టిస్తోంది.
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెరగడం ఖాయమని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ (డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా) తెలిపింది. అప్పటి వరకు ధరల పెరుగుదల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ సంస్థ పార్ట్నర్ దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చమురు, గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా చమరు ధరల్లో జరిగే హెచ్చుతగ్గులకు అనుగుణంగానే దేశీయంగా ఈ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి.
అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపును ఈ సంస్థలన్నీ పక్కనపెట్టేశాయి. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందన్న కారణంతో ప్రభుత్వ ఆదేశాలతో ఈ సంస్థలన్నీ ధరల పెంపును తాత్కాలికంగా పక్కనపెట్టాయి. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వం చమురు ధరలను ముట్టుకోదని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 10వ తేదీ తర్వాత లీటరుపై 8 నుంచి 9 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా పన్ను రూపంలో ప్రభుత్వం ఎంతో కొంత తగ్గిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, పన్ను మినహాయింపు పోగా మిగిలిన భారాన్ని మాత్రం వాహనదారులే భరించాల్సి వుంటుందని అన్నారు. పెట్రో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయని అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు ఇంధన ధరల ప్రభావం అన్నింటిపైనా పడుతుందని.. మరీముఖ్యంగా రవాణరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మిశ్రా అన్నారు. అంతర్జాతీయంగా కనుక బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటును అదుపు చేయడం భారత్కు సవాలే అవుతుందని పేర్కొన్నారు. అలాగే, చమురు ధరలు 10 డాలర్లు పెరిగితే దేశ వృద్ధిలో 0.3 నుంచి 0.35 శాతం మేర కోత పడుతుందని మిశ్రా వివరించారు.
ఇప్పటికే 70 సంవత్సరాల్లో లేని విధంగా ఇంధన ధరలు.. సెంచరీ మార్కును దాటి ఏకంగా లీటరు రూ.108కు చేరుకుంది. అయితే ఈ ధరల ఐదు రాష్ట్రాల ఎన్నికత తరువాత మరింతగా పెరగనుందన్న వార్త వాహనదారుల్లో అందోళన పుట్టిస్తోంది. ఇక దీంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయాల ధరలు కూడా పోటీపడి కేజీకి ఏకంగా వంద మార్కును దాటుతున్నాయి. ఈ తరుణంలో మరోమారు ఇంధన ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తరువాత పెంచనున్నారన్న వార్తలతో ప్రజలు కూడా అందోళన చెందుతున్నారు. ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా అకాశానంటుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more