కరోనా మహమ్మారి మూడవ దశ ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే ఈ వేరియంట్ అందరికీ సోకి తగ్గడంతో సహజంగా బాధితుల్లో ఉత్పన్నమయ్యే యాంటి వైరల్స్ కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఇక మూడవదశ ఇప్పుడిప్పుడే తగ్గుతూ జనం ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. ఇక ప్రశాంతమైన జీవితం గడపొచ్చని అనుకుంటున్న ప్రతిసారి కొత్త రూపంలో విరుచుకుపడుతూనే ఉంది. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఈ అరాచకం నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న జనాలపై మరో బాంబు పేల్చారు వుహాన్ శాస్త్రవేత్తలు.
కరోనా వైరస్ను పోలిన కొత్త రకం వైరస్ను గుర్తించినట్లు చైనా మరో షాకింగ్ ప్రకటన చేసింది. ఇది కరోనా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇది గనుక విజృంభిస్తే ప్రతి ముగ్గురిలో ఒక మరణం నమోదు అవుతుందని హెచ్చరిస్తున్నారు. వుహాన్ సైంటిస్టులు చెప్పిన ఈ విషయాన్ని ప్రపంచం మొత్తాన్ని మరోసారి భయాభ్రాంతులకు గురి చేస్తోంది. నియోకోవ్ కరోనా వైరస్ రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ గబ్బిలాల నుంచి జంతువులకు సోకుతుందని వూహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియోకోవ్ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం నియోకోవ్ వైరస్ జంతువుల్లో మాత్రమే వ్యాప్తి చెందుతుందని వుహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలా అని ఈ వైరస్ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని.. ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గబ్బిలాల్లోని యాంజియో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ2)ను సమర్థంగా వాడుకుని నియోకోవ్ వైరస్ మనుగడ సాధిస్తుంది. అయితే ఈ వైరస్ మనుషుల్లోని ACE2ను ఏమార్చి మనిషి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కాకపోతే ఈ నియోకోవ్ లోని ఒక మ్యుటేషన్ కారణంగా మనుషులకు సోకే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. వుహాన్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more