TTD Board sends good news to Tirumala SriVari Devotees తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Good news to tirumala sri vari devotees ttd to issues offline soon

TTD, Srivari darshan free tickets, srivari darshan offline tickets, free sarvadarshan tickets offline, Sarva darshanam tickets offline, free darshan tickets offline, Sarva darshanam free tickets offline, Tirumala Tirupati, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Andhra pradesh, politics

Tirumala Tirupati Devasthanam Board sends good news to Tirumala SriVari ordinary Devotees, by issuing offline darshan (sarva darshanam) Tickets soon. The free tickets quota is not reaching the rural area devotees. TTD said it will extends the tickets following covid protocol.

తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

Posted: 01/29/2022 11:34 AM IST
Good news to tirumala sri vari devotees ttd to issues offline soon

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పనుంది. గత కొన్ని నెలలుగా ఏడుకొండలు ఎక్కినా శ్రీవారి దర్శనభాగ్యం కలగని భక్తులకు త్వరలో ఊరట లభించనుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలను కూడా అన్ లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ.. ఇకపై సర్వదర్శన టోక్లన్ల ఆఫ్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్‌ 25 నుంచి రద్దు చేశామని చైర్మన్‌ వివరించారు. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదనే భావనలో టీటీడీ ఉందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీవేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా నిమిషాల్లోనే అవి బుక్‌ అయ్యాయి.

ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి స్లాట్‌ సర్వదర్శనం  టికెట్లను ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, అవి కూడా నిమిషాల వ్యవధిలో బుక్కయ్యాయి. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్‌ సేవగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతి స్మార్ట్‌ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ తొలిదశ నిర్మాణాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles