ఆంధ్రప్రదేశ్ లో మరోమారు దారుణ ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి దేవాలయంలో కలకలం రేగింది. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలకు చెందిన ఆలయాలపై జరుగుతున్న దాడుల మరోమారు వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పునారావృతం అయ్యాయి. దేవాలయంలోని వినాయకుడికి చెందిన పాత రథ చక్రాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి దహనం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఆలయంలోని స్వామి వారికి దేవాలయ కమిటీ కొత్త రథాన్ని తయారు చేయించింది.
దీంతో పాత రథ చక్రాలను గోశాల పక్కన నిల్వ ఉంచారు. ఈ విషయం తెలిసిన దుండగులు దేవాలయ ఆవరణలో వున్న పాత రథచక్రాలను నిప్పుపెట్టి దహనం చేశారు. ఈ ఘటనలో రథ చక్రాలు పూర్తిగా కాలిపోయి, బూడిదగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాణిపాకం ఆలయానికి చేరకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు స్థానికంగా వున్న సిసిటీవీ ఫూటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more