ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల మేర సెక్యూరిటీల కుంభకోణంలో కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి, ఆ సంస్థ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జి.హరికృష్ణలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీకి అనుమంతించింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న ఆయనను.. వైద్య పరీక్షల అనంతరం ఈడీ కార్యాలయానికి తరించారు. మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రుణాల ద్వారా సేకరించిన మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది. పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రుణాల ద్వారా సేకరించిన మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ వ్యవహారంపై సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోమవారం ఉదయం బెంగళూరులో పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి హైదరాబాద్కు తరలించిన విషయం తెలిసిందే.
కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కాగా, కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకుని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more