ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ధరల పట్టికను లక్నో జిల్లా ఎలక్షన్ అధికారి విడుదల చేశారు. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఒకే విధమైన రేట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు రేట్ కార్డులను విడుదల చేశారు. దీంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి తన రేట్ కార్డు ప్రకారం వ్యయాల పట్టికను ఎన్నికలఅధికారులకు సమర్పించాల్సి వుంటుంది. చిన్నా, పెద్ద పార్టీలతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా ఈ ధరల పట్టిక మేరకే తమ వ్యయాల పట్టికను సమర్పించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
ఇక ధరల విషయానికి వస్తే ఒక కప్పు టీ రూ.6, ఒక సమోసా రూ.6గా ఈసీ నిర్ణయించింది. అలాగే, నాలుగు పూరీలు, ఒక స్వీట్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ ధరను రూ.37గా ఖరారు చేసింది. మామూలుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం తెలిసిందే. ఈ ఖర్చుకు పరిమితి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.40 లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి లేదు. పోటీ చేసే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులు వారి గెలుపు, ఓటములను ప్రభావితం చేయరాదన్నది ఈ నిబంధన ఉద్దేశ్యం.
ఎంఆర్పీ ధరపై మినరల్ వాటర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. మెడలో వేసే పూలదండకు రూ.16, ముగ్గురు డ్రమ్ములు వాయించే వారికి రోజుకు రూ.1,575 ఇచ్చుకోవచ్చు. కార్లను అద్దెకు తీసుకుంటే.. బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ అయితే నిత్యం రూ.21,000, పజెరో స్పోర్ట్ కు రూ.12,600, ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్వాలిస్ కు రూ.2,310 చొప్పున రోజువారీ ఖర్చు పెట్టుకోవచ్చు. అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాలి. అందులో ఈసీ నిర్ణయించిన రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more