హరిద్వార్, ఢిల్లీ వేదికగా జరిగిన ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేయడంతో పాటు ఓ వర్గానికి చెందినవారిని ఎదుర్కోవడంలో అవసరమైతే అయుధాలను వాడాలని, వారిపై మారణహోమం సృష్టించాలని వ్యాఖ్యలు చేసిన హిందూ ధర్మ సంసద్ వక్తలను ఎందుకు అరెస్టు చేయలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి.. పది రోజుల వ్యవధిలో నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని అదేశించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ధర్మసంసద్ పేరుతో నిర్వహించిన మతవాద సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులతో ఇవాళ అరెస్టు చేశారు. వ్యక్తుల అరెస్టులు ప్రారంభమయ్యాయి. ధర్మ సంసద్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ వసీం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగి త్యాగి, యతి నరసింహానందను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. విపక్షాలన్నీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విదితమే.
ధర్మ సంసద్ వేదికగా ముస్లింలపై జితేంద్ర నారాయణ్ త్యాగి విద్వేష పూరిత ప్రసంగం చేశారంటూ గుల్బర్ ఖాన్ అనే వ్యక్తి హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. యతి నరసింహానంద ఆధ్వర్యంలో డిసెంబర్ 17 నుంచి 19 వరకు హరిద్వార్లో ధర్మ సంసద్ జరిగింది. ఈ సందర్భంగానే ఓ వర్గంపై వీరు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారు. మరోవైపు ధర్మ సంసద్లో వీరు చేసిన ప్రసంగాలకు గాను ఉత్తరాఖండ్ పోలీసులు జితేంద్ర త్యాగితో సహా పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. హిందూ నేతలు ఇలాంటి ప్రసంగాలు చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more