ఢిల్లీ వేదికగా గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన ‘ధర్మ సంసద్’ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేసిన అంశంపై ఇవాళ విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. మతవాద కార్యక్రమాలను నిర్వహించి.. వాటి వేదికగా ఇతర వర్గాలకు చెందిన మైనారిటీ ప్రజలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో ఈ ఘటనపై పది రోజుల లోపు సమాధానం ఇవ్వాలని అదేశించింది. పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాశ్, జర్నలిస్టు ఖుర్బాన్ అలీ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
డిసెంబర్ 17 నుంచి 19 వరకు హిందూ యువవాహిని, హరిద్వార్ లో మతగురువు యతి నర్సింహానంద్ నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో ద్వేషపూరిత ప్రస్ంగాలు చేశారని పిటీషన్ దారులు వేర్వురుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో జాతీ ప్రక్షాళన చేయడానికి ముస్లింలపై మారణహోమం చేయడానికి బహిరంగంగా పిలుపునివ్వడం అక్షేఫనీయమని పిటీషనర్లు పేర్కోన్నారు. హరిద్వార్లో గత ఏడాది జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో.. ముస్లింలకు వ్యతిరేకంగా అసరమైతే ఆయుధాలను కూడా వాడేందుకు వెనకాడరాదని హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేశారు. దీనికి తోడు ఆ ప్రసంగాల తాలుకు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని,
దీంతో వీళ్లు కూడా మా పక్షం అంటూ మరో వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కోట్టిందని, అందులో ఓ పోలీసు అధికారి నవ్వుతూ కనిస్తున్నారని పిటీషనర్లు పేర్కోన్నారు. ఢిల్లీలో జరిగిన హిందూ సంసద్ సభావేదికగా.. ఓ వర్గానికి చెందినవారిపై అవసరమైతే ఆయుధాలను కూడా వినియోగించాలని బహిరంగంగా పిలుపునిచ్చినా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు వారిపై చర్యలు చేపట్టలేదని పిటీషనర్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఇదే తరహాలో ఈ నెల 23న ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగడ్ లో జరగనున్న మరో ధర్మ సంసద్ సభను నిలిపివేయాలని స్థానిక అధికారులను సంప్రదించాలని అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్లకు సూచించింది.
తరువాత ఓ పోలీసు అధికారి నవ్వుతూ కనిపించడంతోముస్లింలను టార్గెట్ చేయాలన్న అభిప్రాయాల్ని వినిపించారు. ఈ కేసులో దాఖలైన పిటిషన్ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య బెంచ్ విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ధర్మ సంసద్ కార్యక్రమాలల్లో విధ్వేషపూరిత ప్రసంగాలను నేతలు యధేశ్చగా చేస్తున్నా.. వారిపై ఎలాంటి చర్యలను పోలీసులు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు, ఇదే కొనసాగితే దేశంలో అస్తవ్యస్థ వాతావారణం నెలకొంటుందని అందోళన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more