వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. గతంలో రఘురామరాజు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంపీపై కేసులు నమోదయ్యాయి, ఈ కేసుల్లో విచారణకు ఈ నెల 17న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ అని, పండుగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
పండుగకు వస్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారా అని విమర్శించారు. ఏపీ సీఐడీ, సీఎం జగన్కు పండుగ రోజే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. పండుగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలన్నారు. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులను నమ్మే వ్యక్తినని, కరోనా ప్రొటోకాల్స్కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని వెల్లడించారు. గతంలో తనను హింసించినప్పుడు కెమెరాలు ఎందుకు లేవన్నారు. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నామన్నారు. తనను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో తనకు తెలుసన్నారు. తనను ఎంతగా హింసించారో ప్రజలకు తెలియాలన్నారు.
రావణరాజ్యంపై ప్రజలు విసుగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హీరో ఎవరో, కీచకుడెవరో తేలుద్దామన్నారు. సునీల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం వచ్చిందని చెప్పారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారన్నారు. ఈ నెల 17న విచారణకు రావాలని తెలిపారన్నారు. గురువారం నరసాపురం వస్తున్నానని జిల్లా కలెక్టర్, ఎస్పీకి చెప్పానని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎంపీ రఘురామకు పోలీసులు నోటీసులు జారీచేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more