సమాజంలోని గౌరవప్రదమైన పదవులలో వున్న ముస్లిం మహిళల ఫోటోలను మార్పింగ్ చేసి.. వారిని బుల్లి బాయ్ అనే యాప్ ద్వారా వేలానికి పెట్టిడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆభియోగాలు ఎదర్కోంటున్న యాప్ మాస్టార్ మైండ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బుల్లీభాయ్ యాప్ వెనుక సూత్రధారిగా వున్న 18 ఏళ్ల బాలిక శ్వేతాసింగ్ అని ముంబై సైబర్ సెల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 1న తమ అభ్యంతరకర ఫోటోల, అనుచిత వ్యాఖ్యలు ఈ యాప్ లో కనిపిస్తున్నాయని పలువురు మహిళలు పిర్యాదుతో కదిలిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ కేసులో సూత్రధారిగా బావిస్తున్న శ్వేతాసింగ్ అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉదంసింగ్ నగర్ జిల్లా రుద్రపూర్ కు చెందిన శ్వేతాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అమె ఇంటర్ విద్యను పూర్తి చేసి.. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షలకు సన్నధం అవుతున్నట్లు తెలిసింది. ఇక తల్లిదండ్రులను కోల్పోయిన ఈ అమ్మాయి పేదరికం నుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుందని తెలుస్తోంది. ఈ అమ్మాయికి ఇద్దరు సోదరీమణులు వుండగా, ఎనమిదవ తరగతి చదవుతున్న ఓ తమ్ముడు కూడా వున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఉత్తరాఖండ్ నుంచి ట్రాన్సిట్ రిమాండ్ అమెను ముంబైకి తీసుకువచ్చిన పోలీసులు అమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు.
100 మంది వరకు ముస్లిం మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి.. బుల్లీభాయ్ యాప్ లోకి అప్ లోడ్ చేయడమే కాకుండా, వేలానికి పెట్టినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై జనవరి 1న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ఇదివరకే మయాంక్ రావల్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా సూత్రదారి శ్వేతా సింగ్ తో పాటు బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల విశాల్ కుమార్ ఝాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
కాగా వీరికి యాప్ రూపోందించేందుకు సహకరించిన వారితో పాటు ట్విట్టర్ లో పోస్టు చేసేందుకు సహకరించిన వారిని కూడా త్వరలోనే అరెస్లు చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్వేతాసింగ్ ను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ కు చెందిన జియూ అనే సోషల్ మీడియా స్నేహితుడి సూచనల మేరకు ‘జట్ ఖల్సా07’ అనే నకిలీ ఖాతాను ఆమె తెరిచింది. ఈ ఖాతా ఆధారంగా బుల్లీభాయ్ యాప్ లో కంటెంట్ పోస్ట్ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఉత్తరాఖండ్ డీజీపి అశోక్ కుమార్ మాత్రం శ్వేతాసింగ్ పేదరికం నుంచి బయటకు వచ్చేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని ఉంటుందని భావిస్తున్నారు. కేవలం డబ్బులు ఆర్జించేందుకు మాత్రమే అమె ఇలా చేసి ఉంటుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more