Issue notices through advt: HC tells petitioner ఆ ముగ్గురు టీటీడీ సభ్యులకు అలా నోటీసులు ఇవ్వండీ: హైకోర్టు

Ttd appointments issue notices through advertisements andhra pradesh hc tells petitioner

Tirumala Tirupati Devasthanam, TTD Trust Board Members, AP High Court, Chief Justice Prasanth Kumar Mishra, Justice M Satyanarayana Murthy PIL, Bhanu Prakash Reddy, News Papers Advt, Court Notices, Katasani Rambhupal Reddy, MN Sashidhar, Alluri Maheswari, N Aswini Kumar, Andhra Pradesh, Crime

The Andhra Pradesh High Court asked BJP leader G Bhanu Prakash Reddy to issue notices through advertisement in vernacular newspapers to those who have refused to take the notices served on them. The directive was issued based on his petition challenging the appointment of a few, who have been facing cases against them, in the TTD Trust Board.

ఆ ముగ్గురు టీటీడీ సభ్యులకు దినపత్రికల ద్వారా నోటీసులు ఇవ్వండీ: హైకోర్టు

Posted: 01/05/2022 01:19 PM IST
Ttd appointments issue notices through advertisements andhra pradesh hc tells petitioner

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరితులు, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న 18 మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందని అరోపిస్తూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్ లో టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించిన వారిలో 18 మందికి నేరచరిత్ర, లేదా రాజకీయ పార్టీలతో సంబంధాలు వున్నాయని పేర్కోన్నారు. గతంలో దాఖలైన ఈ పిటీషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం పిల్ లో పేర్కోన్నవారికి నోటీసులు దాఖలు చేయాలని అదేశించింది.

భాను ప్రకాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ ను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం సత్యనారాయణమూర్తి లతో కూడిన రాష్ట్రోన్నత న్యాయస్థాన ధ్విసభ్య ధర్మాసనం విచారించింది. అయితే తాము అందజేసిన నోటీసులను తీసుకోవడానికి ముగ్గురు టీటీడీ ట్రస్టుబోర్డు సభ్యులు నిరాకరించారని తెలిపారు. హైకోర్టు జారీచేసిన నోటీసులను వారు తిప్పిపంపించారని భాను ప్రకాశ్ రెడ్డి తరపు న్యాయవాది ఎన్ అశ్వనీ కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే నోటీసులను తిరస్కరించిన వారికి స్థానిక దినపత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు పిటీషనర్ కు సూచిచింది.

తమపై కేసులు ఎదుర్కొంటున్న కొందరిని టీటీడీ ట్రస్ట్ బోర్డులో నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ట్రస్ట్‌బోర్డు సభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎంఎన్‌ శశిధర్‌, అల్లూరి మహేశ్వరిలకు పంపిన నోటీసులు తిరిగి వచ్చాయని, మరికొందరు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. నోటీసులను ఆమోదించిన వారు తమ కౌంటర్ దాఖలు చేయాలని కోరిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles