దేశంలో నూతన సంవత్సరం వేడుకల వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి మూడవదశ ముపుతో విరుచుకుపడుతోంది. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని ఇప్పటికే నిపుణులు అంచనావేశారు. మహారాష్ట్ర తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కొత్త వేరియంట్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రోజు దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఇది మూడో వేవ్కు సంకేతం కాగా ఢిల్లీలో మాత్రం ఇది ఐదో వేవ్ గా ఆయన పేర్కోన్నారు.
ఒమిక్రాన్తో లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. దీనిని తేలిగ్గా తీసుకోరాదని కూడా ఆయన సూచించారు. అయితే అందోళన చెందాల్సిన స్థాయిలో లక్షణాలు, తీవ్రత లేకపోవడం కొంత ఊరట కలిగించే విషయమే అయినా.. ఇది దశలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించిన వారు తప్పితే.. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఒమిక్రాన్ దరి చేరడం ఖాయమని చెప్పారు. బౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి నియమాలు పాటిస్తేనే ఒమిక్రాన్ దరి చేరదని చెప్పారు. వాక్సీన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసినట్లు చెప్పారు.
ఢిల్లీలో క్రితం రోజున 5,481 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు రోగులు కరోనా బారినపడి మరణించారు. ఇప్పటివరకూ ఢిల్లీలో 14,63,701 మందికి వైరస్ సోకగా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన 464 మంది పడ్డారు. ఢిల్లీలో వచ్చేవారం నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 15 నాటికి రోజువారీ కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్.. రెండు వేరియంట్లు కారణమని తెలిపాయి. గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరగడం ఆందోళనలకు గురిచేస్తోంది.
ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనావైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకుముందు రోజు నమోదైన 30వేల కొత్త కేసులు గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా రెట్టింపు సంఖ్యకు చేరకున్నాయి. ఇవాళ ఒక్కసారిగా 58 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కేసుల పెరుగుదలకు కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి. దీంతో రానున్న రెండు వారాల్లో ఈ కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరొచ్చని డబ్యూహెచ్ఓ ప్రిన్సిఫల్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more