సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్త దేశాలు అన్నింటికీ క్రమంగా వ్యాపించిన ఈ సరికొత్త వేరియంట్.. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరీకన్ల వెన్నులో చలిపుట్టించేలా చేయడానికి ముఖ్యకారణం అక్కడ ఈ వేరియంట్ పిల్లల్లో అధికంగా సోకడమే కారణం. గత కొద్ది రోజులుగా అగ్రరాజ్యంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ.. మునుపటి అత్యధిక స్థాయిలను మించి నమోదువుతున్నాయి. సోమవారం ఒక్కరోజునే ఏకంగా పదిలక్షల కొత్త కేసులను నమోదయ్యేలా చేసింది. ఈ మేరకు అమెరికా వార్తా సంస్థ యూఎస్ఏ టుడే కథనాన్ని వెల్లడించింది.
దీన్ని బట్టి కరోనా కొత్త వేరియంట్ ఎంతటి వేగంతో వ్యాప్తి చెందుతుందో ఇట్టే అర్థమౌతోంది. అయితే అమెరికాలో ఈ మేర కొత్తకేసులు నమోదు కావడానికి అక్కడి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు ప్రధాన కారణంగా అక్కడి వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా పలు ఆంక్షలను అధికారులు అమలులో పెట్టినా.. ప్రజలు విస్మరించడంతోనే కొత్త కేసులు సంఖ్య గతంలో కంటే మూడింతలు పెరిగి పది లక్షల మేర నమోదయ్యాయని కథనంలో యూఎస్ఏ టుడే పేర్కోంది. ఇక దీనికి తోడు ప్రతీ రోజు కనీసం 500 మంది టీనేజ్ బాలబాలికలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి 7.30 గంటల వరకు అమెరికా వ్యాప్తంగా 10,42,000 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు గత గురువారం అమెరికాలో ఒక్కరోజే 5.91లక్షల కేసులు బయటపడగా.. తాజాగా దానికి రెట్టింపు కేసులు నమోదవడం కలవరపెడుతోంది. గత వారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్ బారినపడినట్లు యూనివర్సిటీ పేర్కొంది. కాగా తాజాగా ప్రతి అరుగురిలో ఒకరు కరోనా మూడవ దశ ప్రభవం బారిన పడ్డారు. అంటే అమెరికాలో మొత్తం 505 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.
ఇక దీంతో ఏకంగా లక్షకు పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే వారిలో 18 వేలకు పైగా బాధితులు ఐసీయూలో వున్నారని తెలిపింది. గత ఏడాది ఇదే సంవత్సరంలో అత్యధికంగా 1.42లక్షల మంది అసుపత్రి పాలవ్వగా, ఇప్పుడు అదే స్థాయిలో అసుపత్రిలో చేరికలు అందోళనకు గురిచేస్తోంది. ఇక ఇప్పటివరకు అమెరికాలో 8.26 లక్షల మందికి పైడా మహమ్మారి బలితీసుకుందని జాన్ హాపి్కన్స్ డేటా వెల్లడించింది. ఇక అగ్రారాజ్యంలో కరోనా టీకా కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 62శాతం మంది అమెరికన్లు డబుల్ డోస్ వాక్సీన్ ను తీసుకున్నారు. కాగా వీరికి తాజాగా బూస్టర్ డోసులను కూడా అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more