రైతుల ఆందోళనల విషయంలో కేంద్రప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో ఆయన తన స్వరాన్ని మార్చారు. వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అమిత్ షాకు ప్రధాని నరేంద్రమోడీ అంటే చాలా గౌరవమని చెప్పుకోచ్చారు. ఆయన ఎప్పుడు మోడీ గురించి చెడు ఉద్దేశంతో మాట్లాడరని అన్నారు. ప్రధాని మోడీకి చెడును అపాదించే విధంగా ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదన్నారు. రైతులపై తన అందోళన అర్థమయ్యిందని మాత్రమే అన్నారని వివరణ ఇచ్చారు.
ఇంతలా ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. హర్యానాలోని చర్ఖీ దాద్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యాపాల్ మాలిక్ మాట్లాడుతూ.. రైతుల ఆందోళనల విషయమై తాను ఇటీవల మోదీతో సమావేశం అయ్యానని, అందులో అన్నదాతల మరణాలపై మోదీ అహంకారపూరితంగా మాట్లాడారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. అంతేకాదు మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారాయి. ప్రతిపక్ష నేతలు కూడా విస్మయం చెందేలా చేసిన ఆయన వ్యాఖల వెనుక కీలక విషయాలు ఏమీటన్న వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల తాను ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యానని చెప్పుకోచ్చిన సత్యపాల్ మాలిక్.. ఈ సందర్భంగా రైతు సమస్యలపై మాట్లాడానని అన్నారు. ‘‘ప్రధానితో భేటీ అయిన ఐదు నిమిషాలకే వాగ్వాదం మొదలైంది. 500 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని నేను చెప్పాను. ఓ కుక్క చనిపోయినా మీరు సంతాప లేఖ పంపుతారు కదా అని అడిగాను. వారు నా కోసం చనిపోయారా.? అని అహంకారంతో ప్రశ్నించారు మోడీ. దానికి నేను ‘అవును.. మీరే పాలకులు కాబట్టి’ అని సమాధానమిచ్చాను. చివరకు గొడవతో ఆ సమావేశం ముగిసింది. అమిత్ షాను కలవమని ప్రధాని నాకు చెప్పారు’’ అని పేర్కొన్నారు.
అమిత్ షాను కలిసిన తర్వాత జరిగిన సంభాషణనూ అందులో వివరించారు. ‘‘ఆయనకు(మోదీ) మతి తప్పింది. కొందరు ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏదో రోజు ఆయనకు వాస్తవం బోధపడుతుంది. మీరు ఇవేం పట్టించుకోకండి. మమ్మల్ని కలుస్తూ ఉండండి అని షా నాతో చెప్పారు’’ అని మాలిక్ ఆ వీడియోలో చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది. వీడియోలో తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాలిక్ తన స్వరాన్ని మార్చారు. ‘‘రైతుల సమస్యలకు సంబంధించి ప్రధాని నా అభిప్రాయాలను వినడానికి తిరస్కరిస్తూ అమిత్ షాను కలవమన్నారు. షాకు మోదీపై చాలా గౌరవం వుంది. ఆయన పట్ల ఎంతో గౌరవంగానే ఆయన మాట్లాడారు అని మాలిక్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more