విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకోల్పిన కార్పోరేట్ పాఠశాల ప్రభావమో ఏమో తెలియదు కానీ.. పెద్దలను గౌరవించవలెను అన్న నానుడికి ఈ తరం వారు అసలు పట్టించుకోవడం లేదు. తమకు తోచిన విధంగా వ్యవహరిస్తూ.. పాశ్చాత మోజులో తమ ఇంటి సంస్కృతి సంప్రదాయాలను పక్కనబెట్టేస్తున్నారు. రోడ్డుపై ఎవరైనా పెద్దలు తమ వాహనాలను నడిపించుకుంటూ వెళ్తుంటే వారికి కంగారు పెట్టకుండా.. వారికి కొంత దూరం నుంచే వెళ్లేవాళ్లను చూశాం. కానీ ఏకంగా వారి కారుకు అడ్డంగా వెళ్లి.. వారిని కంగారు పెట్టి.. ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యే వారిని చాలా అరుదుగా చూస్తుంటాం.
ఇక అందులోనూ తల్లి వయస్సులో వున్నవారితో అమర్యాదగా మాట్లాడమే కాకుండా.. అసభ్యకరంగా వ్యవహరించడంతో ఓ 66 ఏళ్ల వృద్దురాలికి ఆగ్రహం తెప్పింది. తన పట్ల అసభ్యకరంగా వ్వవహరించి.. మధ్య వేలు చూపించిన ఓ యువకుడిపై కేసు పెట్టింది. దీంతో ముంబైలోని స్థానికి గిర్ గావ్ మెజిస్ట్రేటు కోర్టు.. యువకుడికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే 2018 సెప్టెంబర్ 17న ఓ మహిళ తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి మరో కారు వారి కారు ముందుకు వచ్చింది. దీంతో వారు కంట్రోల్ కోల్పోయారు. ఆమె కారు 100 మీటర్ల వరకు అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఎలాగోలా కంట్రోల్ లోకి వచ్చింది. ఆ తర్వాత సిగ్నల్ వద్దకు వచ్చి ఆగింది.
అదే సమయంలో మరో కారు వచ్చి వారి కారు పక్కన ఆగింది. అయితే సదరు మహిళ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వచ్చిందంటూ కారులోని 33 ఏళ్ల వ్యక్తి వారిని దూషిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... ఆమె కుమారుడు తమ కారును ఆ వ్యక్తి కారుకు అడ్డుగా పెట్టాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ తర్వాత పోలీసులు సీన్ లోకి ఎంటరై తల్లీకుమారులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే, వాదనలు జరుగుతున్న సమయంలో మహిళకు ఆ యువకుడు మధ్య వేలిని చూపించాడు. దీంతో, ఆ యువకుడిపై సదరు మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును విచారించిన కోర్టు యువకుడికి శిక్షను విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more