సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఆంగ్ల పరీక్షలో మహిళలను కించపర్చేలా ఒక కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి.. ఈ ప్యాసెజ్ ను రద్దు చేసి తప్పుదిద్దుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతల ధోరణి పూర్తిగా మారిపోయిందని అన్నారు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంపై ఆమె మండిపడ్డారు. ఇక ఈ ప్రభావాన్ని భవిష్యత్ తరంపై కూడా రుద్దేలా చర్యలకు పూనుకోవడం సహేతుకం కాదని అన్నారు.
బీజేపి నేతలు తాము పురుషహాంకార సమాజంలో ఉన్నామని, మహిళలను తమ బాసినలుగా మలుచుకుని మళ్లీ ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను తీసుకువచ్చేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని అమె ప్రశ్నించారు. సోమవారం లోక్సభ జీరో అవర్లో సోనియా ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రశ్నను ఉపసంహరించుకోవాలని, ఈ ఘోర తప్పిదంపై సమీక్ష చేయించాలని సోనియాగాంధీ డిమాండ్ వినిపించారు. కాగా, గత శనివారం సీబీఎస్ఈ 10వ తరగతి ఆంగ్ల పరీక్ష జరిగింది.
ఆ పరీక్షలో ఇచ్చిన ఓ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో మహిళలను కించపర్చే వాఖ్యలు ఉన్నాయి. మహిళలకు స్వేచ్ఛనిస్తే చిన్నారులపై తల్లిదండ్రులు ఆదిపత్యం కోల్పోతారు అనేది అందులో ఒక వాక్యం. భర్త మార్గంలో నడుచుకోవడం ద్వారానే తల్లి వయోజనులైన పిల్లల విధేయతను పొందగలదు అని మరో వాఖ్యం ఉన్నది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్సభలో సోనియా పట్టుబట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
#WATCH | Congress interim chief Sonia Gandhi raises in Lok Sabha the issue of inclusion of a 'shockingly regressive passage' in CBSE's question paper for Grade 10 exam, demands withdrawal of the passage & apology
— ANI (@ANI) December 13, 2021
(Source: Sansad TV) pic.twitter.com/lO1Db4ty3q
రాహుల్, ప్రియాంక స్పందన ఇలా
పదోతరగతి సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరెస్సెస్, బీజేపీల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మహిళల విముక్తి పిల్లలపై తల్లితండ్రుల ఆధిపత్యాన్ని నాశనం చేసిందని శనివారం నిర్వహించిన సీబీఎస్ఈ ఆంగ్ల పరీక్ష ప్రశ్నాపత్రంలో పొందుపరిచిన నేపధ్యంలో రాహుల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.
తన భర్త మార్గాన్ని అంగీకరించడం ద్వారానే తల్లి పిల్లలపై విధేయతను పొందగలదని మరో వాక్యంలో పొందుపరిచారు. చిన్నారులు కష్టపడి పైకి ఎదగాలని, మూఢవిశ్వాసాలు ఉపకరించవని రాహుల్ పిలుపు ఇచ్చారు. మరోవైపు సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంలో దొర్లిన వాక్యాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లింగ అసమానతలను, పురోగమన ఆలోచనలను ప్రేరేపించేలా ఉందని అభివర్ణించారు. మహిళలపై తిరోగమన ఉద్దేశాలను బీజేపీ విశ్వసించని పక్షంలో సీబీఎస్ఈ కరిక్యులంలో వీటిని ఎందుకు ప్రస్తావించారని ఆమె ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more