సాధారణంగా నీళ్లలో ఈత కొట్టాలంటే ఖచ్చితంగా ఈత రావాల్సిందే. లేదంటే మునిగిపోతారు. కానీ.. ఈ పూల్లో మాత్రం మనుషులు మునిగిపోరు. ఈత రాని వాళ్లు కూడా నీటి మీద తేలియాడుతారు. అక్కడ ఉన్న ఏ పూల్లో అయినా అంతే. దానికి కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ పూల్స్ ఎక్కడున్నాయి అంటారా? ఈజిప్ట్లోని సివా ఒయాసిస్లో ఉన్న పూల్స్ గురించే మనం మాట్లాడుకునేది. అక్కడ ఎక్కువగా సాల్ట్ పూల్స్ ఉంటాయి.
సముద్రపు నీటి కంటే కూడా ఆ నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. అందుకే వాటిని సాల్ట్ పూల్స్ అంటారు. అయితే.. ఆ సాల్ట్ పూల్స్లోకి దిగితే ఈత వచ్చినా రాకున్నా.. మనిషి అందులో మునగడు. ఏ వస్తువు వేసినా కూడా మునగదు. మనుషులు నీటి మీద తేలియాడుతారు. ఈత కొట్టకుండా.. నీళ్ల మీద అలాగే పడుకోవచ్చు. దానికి కారణం.. ఆ నీళ్లలో ఉండే ఉప్పు సాంద్రత. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. ఉప్పు సాంద్రత ఆ నీటిలో అత్యధికంగా ఉండటం వల్ల.. ఆ నీటిలోకి ఏ వస్తువూ మునగదు.
మనుషులు కూడా అంతే. సివా ఒయాసిస్లో ఇటువంటి సాల్ట్ పూల్స్ వందలకొద్దీ ఉన్నాయి. ఈ సాల్ట్ పూల్స్లోకి దిగి కాసేపు నీటిలో ఉంటే.. చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కంటి ఇన్ఫెక్షన్ సంబంధ సమస్యలు, సైనస్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయట. ఇదంతా నిజమేనా.. నమ్మేటట్టుగా లేదు.. మనుషులు తేలియాడటం ఏంటి.. అని ఇంకా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.
Siwa Oasis, Egypt. The intense salt concentration means you can’t sink in the water.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more