బెంగళూరులో ఇద్దరు.. మహారాష్ట్రలో ఒకరు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు కరోనాతో బాధపడటంతో అత్యంత ప్రమాదకరంగా, వేగంగా వ్యాప్తి చెందేదిగా నిపుణులు హెచ్చరిస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ అని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇవాళ ఇదే విషయంమై పార్లమెంటులో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సూక్ మాండవీయ బదులిస్తూ.. ఇండియాలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఒమిక్రాన్ వైరస్ ను అదిలోనే నియంత్రించే చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టిందని చెప్పిన ఆయన.. విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపులో భాగంగా టెస్టింగ్ ను పెంచాలని అన్నిరాష్ట్రాలను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్తో ప్రపంచవ్యాప్తంగా హైరిస్క్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్ను నియంత్రించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన ఈ వేరియంట్ ఇప్పుడు పలు దేశాల్లో విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి వేళ టీబీ వ్యాధి టెస్టింగ్పై ప్రభావం పడిందా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. నిజానికి టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు స్వల్పంగా తగ్గిందని, కానీ దాన్ని మళ్లీ రెట్టింపు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2025 వరకు దేశం నుంచి క్షయ వ్యాధిని నిర్మూలించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కోవిన్ యాప్ తరహాలో టీబీ కోసం ఓ యాప్ను రూపొందించాలని ఎంపీ రూపా గంగూలీ డిమాండ్ చేశారు.
ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి ఇదివరకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాలని కోరారు. దక్షిణాఫ్రికా సహా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటికే అనేక దేశాలు విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, మరి భారత్ ఎందుకు ఆలస్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కరోనా మొదటి దశ విజృంభణ సమయంలో ఇదే ధోరణితో వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఎక్కువశాతం మంది ఢిల్లీలో దిగడం కారణంగా ఇక్కడ ఆ వైరస్ వల్ల దేశరాజధానే ఎక్కువగా ప్రభావితమవుతోందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more