అంతరిక్షంలో వేల సంఖ్యలో ఉపగ్రహాలు నిరంతరం భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని కాలంచెల్లిన శాటిలైట్లు నిరర్ధకంగా ఉంటాయి. ఇటీవల అలాంటి ఓ శాటిలైట్ ను రష్యా పేల్చివేసింది. గతంలోనూ చైనా ఇదే పని చేసింది. అయితే వాటి శకలాలు ఇంకా అంతరిక్షంలోనే వ్యర్థాల రూపంలో ఉండడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది.
అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాక సముద్రంలో కూలిపోతుంటాయి. అవి కూడా సముద్రంలో వ్యర్థాలుగా పరిణమిస్తుంటాయి. ఇస్రో అభివృద్ధి చేస్తున్న కొత్త టెక్నాలజీ సాయంతో ఈ రాకెట్లు తమ పని పూర్తయ్యాక అంతరిక్షంలో తమను తామే ధ్వంసం చేసుకుంటాయి. అది కూడా ఎలాంటి అంతరిక్ష వ్యర్థాలు ఏర్పడని రీతిలో! దీనిపై ఇస్రో చైర్మన్ కె.శివన్ వివరణ ఇచ్చారు.
"సాధారణంగా రాకెట్ల చుట్టూ లోహపు కవచం ఉంటుంది. రాకెట్లను లాంచ్ చేసిన తర్వాత వాటి చివరి దశలో సముద్రంలో పడిపోతుంటాయి. అందుకే మేం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్నాం. రాకెట్ల చుట్టూ ఉండే కేసింగ్ తయారీకి కొత్త రకం పదార్థాలు ఉపయోగించాలనుకుంటున్నాం. రాకెట్లలోని మోటార్లతో పాటే ఆ కేసింగ్ కూడా కాలిపోతుంది. తద్వారా ఎలాంటి వ్యర్థాలు మిగలవు" అని వెల్లడించారు.
అంతరిక్షంలో తిరుగాడే శాటిలైట్లకు కూడా ఇదే టెక్నాలజీ వర్తిస్తుందని, ఓ బటన్ నొక్కితే చాలు ఆ శాటిలైట్ స్వీయ వినాశనం చేసుకుంటుందని వివరించారు. అంతరిక్ష పరిశోధనల రంగంలోకి ప్రైవేటు సంస్థలు కూడా ప్రవేశించి, నిత్యం ఏదో ఒక ప్రయోగం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇస్రో... క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అడ్వాన్స్ డ్ రాడార్లపై మరింత పరిశోధన చేయాలని భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more