Chanchalguda Jail Officials condemns Teenmaar Mallanna allegations తీన్మార్ మల్లన్న అరోపణలను ఖండించిన చంచల్‌గూడ జైలుఅధికారులు

Chanchal guda jail officials condemns teenmaar mallanna sensational allegations

Chanchalguda Jail Officials, Chanchalguda Jail Officials condemns Teenmaar Mallanna allegations, Teenmaar Mallanna, Arrest, chikadpally police, Astrologer, Lakshmikant Sharma, Blackmailing, Hyderabad Police,Q News Office, Police Raids, CM KCR, Srinivas Goud, Corruption, Telangana Rashtra Samithi, TRS social media convenor Krishank, Youtube channel, Cybercrime police, Telanagana, politics, Crime

Popular political activist and journalist Chintapandu Naveen Kumar alias Teenmaar Mallanna had mad sensational allegation on Telangana Government. The Q news Youtube Channel head alleged that the had attempted to kill him in Jail. His allegations are being condemned by Chanchal Guda Jail Officials, Questions how can he be punished in a dark room, which is not there in Jail.

తీన్మార్ మల్లన్న అరోపణలను ఖండించిన చంచల్‌గూడ జైలు అధికారులు

Posted: 11/16/2021 12:26 PM IST
Chanchal guda jail officials condemns teenmaar mallanna sensational allegations

తీన్మార్ మల్లన్నగా తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన జర్నలిస్ట్.. క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అధినేత అలియాస్ చింతపండు నవీన్‌ తెలంగాణ ప్రభుత్వంతో పాటు తమపై చేసిన సంచలన అరోపణలను చంచల్ గూడ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. తనను ప్రభుత్వం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున హతమార్చేందుకు యత్నించిందని.. దానిని తప్పించుకుంటే తనను పిచ్చివాడిని కూడా చేసేందుకు బలవంతంగా ప్రయత్నాలు చేసిందంటూ తీన్మార్ మల్లన్న చేసిన అరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని జైలు అధికారులు ఖండించారు.  

జైలులో ప్రతి ఖైదీకి సౌకర్యాలు ఉంటాయని, వారి బాగోగులు చూసేందుకు భద్రతా సిబ్బంది కూడా ఉంటారని జైలు పర్యవేక్షణాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తీన్మార్ మల్లన్న ఆరోపించినట్టు జైలులో చీకటి గదులే లేవని స్పష్టం చేశారు. లేని గదుల్లో తనను బంధించారని మల్లన్న చెప్పడం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న తమపై అరోపణలు చేసి ప్రజల్లో సానుభూతి పోందాలన్న ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. జైలు అధికారులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఎంతో నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బందిని అబాసుపాలు చేయడం సరికాదని అన్నారు.

రాష్ట్రంలో 2021లో జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసి అరెస్టు చేసిందన్న అరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. అయితే తనను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించాడన్న జ్యోతిష్యుడు లక్ష్మీకాంతశర్మ ఇచ్చిన పిర్యాదుతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఓ కల్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు దండుకున్నాడన్న అభియోగాలతో ఆయనను అరెస్టు చేసి పలుమార్లు ఆయన కార్యాలయాలపై దాడులు చేసిన పోలీసులు.. కార్యాలయంలోని 10 కంప్యూటర్లు, 15 హర్డ్‌ డిస్క్‌లు, కేబుల్‌ పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles