తీన్మార్ మల్లన్నగా తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన జర్నలిస్ట్.. క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అధినేత అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ ప్రభుత్వంతో పాటు తమపై చేసిన సంచలన అరోపణలను చంచల్ గూడ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. తనను ప్రభుత్వం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున హతమార్చేందుకు యత్నించిందని.. దానిని తప్పించుకుంటే తనను పిచ్చివాడిని కూడా చేసేందుకు బలవంతంగా ప్రయత్నాలు చేసిందంటూ తీన్మార్ మల్లన్న చేసిన అరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని జైలు అధికారులు ఖండించారు.
జైలులో ప్రతి ఖైదీకి సౌకర్యాలు ఉంటాయని, వారి బాగోగులు చూసేందుకు భద్రతా సిబ్బంది కూడా ఉంటారని జైలు పర్యవేక్షణాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తీన్మార్ మల్లన్న ఆరోపించినట్టు జైలులో చీకటి గదులే లేవని స్పష్టం చేశారు. లేని గదుల్లో తనను బంధించారని మల్లన్న చెప్పడం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న తమపై అరోపణలు చేసి ప్రజల్లో సానుభూతి పోందాలన్న ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. జైలు అధికారులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఎంతో నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బందిని అబాసుపాలు చేయడం సరికాదని అన్నారు.
రాష్ట్రంలో 2021లో జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసి అరెస్టు చేసిందన్న అరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. అయితే తనను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించాడన్న జ్యోతిష్యుడు లక్ష్మీకాంతశర్మ ఇచ్చిన పిర్యాదుతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఓ కల్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు దండుకున్నాడన్న అభియోగాలతో ఆయనను అరెస్టు చేసి పలుమార్లు ఆయన కార్యాలయాలపై దాడులు చేసిన పోలీసులు.. కార్యాలయంలోని 10 కంప్యూటర్లు, 15 హర్డ్ డిస్క్లు, కేబుల్ పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more