తెలంగాణ ఆర్బీసీ బస్సు డ్రైవర్ తనకు అపాయం పొంచివున్న సమయంలోనూ తన కర్తవ్య నిర్వహణను మాత్రం మర్చిపోలేదు. దీంతో హైదరాబాద్ మహానగరంలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ తన ప్రాణాలు పోతున్న వేళ కూడా తన కర్తవ్యాన్ని మరువక.. తన అపార అనుబవం అందించిన సమయస్ఫూర్తితో బస్సును రోడ్డుకు పక్కన ఆపేసిన ఘటన ఇది. దీంతో ప్రమాదం సంభవించి పదుల సంఖ్యలో ప్రయాణికులతో పాటు రోడ్డుపై వెళ్తున్న తోటి వాహనదారులకు ముప్పు కలిగే అవకాశాలు వున్నా.. తన ప్రాణం కన్నా తన కర్తవ్యానికే ప్రాధాన్యమిచ్చిన డ్రైవర్ త్వరగా కోలుకోవాలని ప్రయాణికులు ప్రార్థిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న బస్సు అది. బస్సులో దాదాపుగా 15 నుంచి 18 మంది వున్నారు. వరంగల్ కు బయలుదేరిన బస్సు డ్రైవర్ శ్రీనివాస్ యధావిధిగా బస్సును నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇంకా నగరంలోని ట్రాఫిక్ లోనే ప్రయాణిస్తోంది. అయితే అకస్మాత్తుగా డ్రైవర్ శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చింది. హైదరాబాదులోని రద్దీ ట్రాఫిక్ నేపథ్యంలోనూ ఆయన తన అపార అనుభవాన్ని, సమయస్ఫూర్తిని వినియోగించి ఎవరికి నష్టం వాటిల్లకుండా బస్సును రోడ్డు పక్కన నిలిపాడు.
డ్రైవర్ పరిస్థితిని చూసిన కండక్టర్ సహా బస్సులోని ప్రయాణికులు వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్సును అప్రమత్తం చేశారు. వివరాలు చెప్పడంతో అంబులెన్స్ శరవేగంగా చేరుకుంది. దీంతో సకాలంలో అసుపత్రికి తరలించడంతో డ్రైవర్ శ్రీనివాస్ అరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట్ కు చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో వారు ఆయనను వెనువెంటనే ప్రైవేటు అసుపత్రి నుంచి తార్నాకాలోని ఆర్టీసీ అసుపత్రికి తరలించారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని అటు ప్రయాణికులు, ఇటు సహచర కార్మికులు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more