పాకిస్థాన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనునిత్యం మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతోందని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ అన్నారు. పాకిస్థాన్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. హిందువులకు పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం నిత్యం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. రాజ్యాంగపరంగా దేశంలోని మూనారిటీలకు లభించే స్వేచ్ఛ, హక్కులు హిందువులకు కూడా ఉంటాయని పేర్కొన్నారు. మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని జస్టిస్ గుల్జార్ అన్నారు.
పాక్ లోని హిందూ ఆలయంపై గత ఏడాది దీపావళి సమయంలో జరిగిన దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఆలయాన్ని ఈ దీపావళి సమయానికి పునఃనిర్మాణం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ఆలయన్ని ప్రారంభించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. కరాక్ జిల్లా తేరి గ్రామంలోని శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ ప్రాచీన దేవాలయంపై గతేడాది డిసెంబరులో కొందరు దుండగులు దాడిచేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో భారతీయ సమాజం నుంచే కాక అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
పాక్ ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాదు, అందుకయ్యే ఖర్చును నిందితుల నుంచే వసూలు చేయాలని ఆదేశించారు. చీఫ్ జస్టిస్ ఆదేశాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో దీపావళి రోజున ఆలయాన్ని పునఃప్రారంభించారు. స్థానిక హిందువులు పెద్ద ఎత్తున హాజరై వైభవంగా వేడుక నిర్వహించారు. నాడు ఆలయ నిర్మాణానికి ఆదేశాలిచ్చిన సీజే జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆలయ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి దీపావళి పండుగ జరుపుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 23 | కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయని, వాటికనుగూణంగా తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆకస్మిక సమ్మెకు దిగిన సినీకార్మికులకు టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన... Read more
Jun 23 | హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి జలక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి.. కౌన్సిలర్ స్తాయికి మాత్రమే పరిమితమైనా.. ప్రజలతో మమేకం అయ్యానని గత ఎనమిదేళ్లుగా పార్టీకి ఎనలేని... Read more
Jun 23 | ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విపక్షాల అరోపణలకు మరో సంఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన కౌన్సీలర్ లావణ్య..... Read more
Jun 23 | ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే... Read more
Jun 23 | మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో... Read more