తెలంగాణలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టగాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కస్సుతో ఉన్మాదిలా మారిన యువకుడు యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఇక యువతి అరుపులు, కేకలు ఇరుగుపోరుగువారికి వినిపించకుండా అమె ఇంట్లోని టీవీ సౌండ్ ను పూర్తిగా పెంచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగిరి మండలం, వెంకట్రావుపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాగా ఘటన తరువాత యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రావుపల్లిలోని యైటింక్లైన్ కాలనీ కేకేనగర్ కు చెందిన గొడుగు అంజలి (20) తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది. తల్లి కూలి పనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండేది. తారకరామానగర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చాట్ల రాజు (20) యువతి ఒంటిరిగా ఉండటాన్ని గమనించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తన ఇంటికి రావొద్దని అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఒక్కసారి కాదు ఏకంగా మూడు పర్యాయాలు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా.. రాజు, అంజలీ దేవి వెంటపడటం వీడలేదు.
ఇదిలావుంచితే, అంజలికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. తన ప్రేమను అర్థం చేసుకోమ్మని బతిమాలాడు. అయినా తన తల్లి మాట జవదాటనని అంజలి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో తమ మాటలు బయటివారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెంచిన రాజు.. అమె నిరాకరిస్తే.. అమెను హత్య చేయాలన్న అప్పటికే రచించుకున్న పథకం ప్రకారం అమెను హత్య చేశాడు. అయితే అంజలి ఇంట్లోని కత్తిపీట కనబడగానే తన పథకాన్ని అమలు చేసేందుకు ఉన్మాదిలా మారిన రాజు అమె గొంతుకోసి దారుణంగా చంపాడు.
అంజలి తల్లి లక్ష్మితో కలిసి పనిచేసే వ్యక్తి ఉపాధిహామీ జాబ్కార్డు ఇచ్చేందుకు నిన్న మధ్యాహ్నం వారింటికి వెళ్లాడు. ఎంతగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా ఉండడంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న అంజలి మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. తేరుకుని బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, అంజలిని హత్య చేసిన రాజు అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more