పాకిస్థాన్ బాలికల విద్యకోసం ఉద్యమించిన ఉద్యమకారిణి, బాలికల హక్కుల ఉద్యమకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాయ్ తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసి.. తనకు ఆశీస్సులను అందించాలని కోరింది. ఎందుకంటారా.. అమె కూడా ఒక్క ఇంటిదయ్యారు. తన భర్తతో కలిసి పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టగానే అవి కాస్తా వైరల్ అయ్యాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై పర్ఫామెన్స్ జనరల్ మేనేజర్ గా వున్న అస్సర్ మాలిక్ ను మాలాలా యూసుఫ్ జాయ్ వివాహం చేసుకున్నారు. 2019లో విరిద్దరూ తొలిసారిగా కలిసినా.. అంతకుముందు నుంచే వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారని తెలుస్తోంది.
ఇక 2020లో ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై పర్ఫామెన్స్ జనరల్ మేనేజర్ గా నియామకం అయిన తరువాత వీరిద్దరూ డేటింగ్ లో వున్నారని కూడా తెలుస్తోంది. వీరి విహాసంబ్రిటన్ లోని బర్మింగ్ హామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మలాలా.. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని అన్నారు. అస్సర్, తాను జీవిత భాగస్వాములమయ్యామని, తమ నిఖా నిరాడంబరంగా జరిగిందని పేర్కొన్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం సాగించడానికి సంతోషంగా ఉన్న తమకు ఆశీస్సులు పంపాలని కోరారు.
పాకిస్థాన్లో బాలికా విద్య హక్కు కోసం ఉద్యమించిన మలాలాను 2012లో అమె పాఠశాల బస్సులోకి చోరబడిన ఉగ్రవాదులు అమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అయితే అమెకు అరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుండటంతో బ్రిటెన్ అధికారులు అమెకు వైద్యం అందించారు. అమె కోలుకున్న తరువాత కూడా బాలిక విద్యాహక్కు కోసం ఉద్యమించింది. కాగా అమె వివాహం సందర్భంగా అమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు అందజేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, రీస్ వితర్ స్పైన్, యూట్యూబర్ లిల్లి సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more